ETV Bharat / state

ప్రజల ప్రాణాలు పోతున్నా.. పట్టించుకోరా?: ఉత్తమ్‌

కాంగ్రెస్‌ పంచాయతీ రాజ్ విభాగం జూమ్‌ ద్వారా సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలనుద్దేశించి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మాట్లాడారు. కరోనా వ్యాధి తీవ్ర స్థాయిలో విజృంభిస్తూ... ప్రజల ప్రాణాలను హరిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమని అన్నారు.

author img

By

Published : May 17, 2021, 8:22 PM IST

Uttam Kumar reddy, congress
ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణలో కరోనా వ్యాధి తీవ్ర స్థాయిలో విజృంభిస్తూ… ప్రజల ప్రాణాలను హరిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ పంచాయతీ రాజ్ విభాగం సోమవారం జూమ్‌ ద్వారా నిర్వహించిన సమావేశంలో సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలనుద్దేశించి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మాట్లాడారు.

ఇలాంటి పాలన ఎక్కడా లేదు

కరోనా విషయంలో కేసీఆర్ ప్రభుత్వం అత్యంత అవమానవీయంగా ప్రవర్తిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో రోగులను తరలించేందుకు అంబులెన్సులు లేవని, ఆస్పత్రుల్లో బెడ్లు లేవని, రోగులకు ఇంజక్షన్లు, మందులు దొరకడం లేదని ఇంత ఘోరమైన పాలన ఎక్కడ లేదని మండిపడ్డారు. పక్క రాష్ట్రాల్లో కరోనా వ్యాధికి ఉచిత చికిత్సలు చేస్తుంటే తెలంగాణలో ప్రైవేటు ఆస్పత్రులు నిలువునా దోచేస్తున్నా… ఎలాంటి నియంత్రణ చర్యలు లేవని ఆరోపించారు. ప్రపంచ దేశాలకు మందులు సరఫరా చేసే శక్తి కలిగిన తెలంగాణ రాష్ట్రానికి మందులు లేకుండా పోవడం దారుణమన్నారు.

ఈనెల 21న సహాయ కార్యక్రమాలు

హైదరాబాద్‌లో కొవాగ్జిన్ వ్యాక్సిన్, రెమ్​డిసివర్ ఇంజక్షన్లు తయారు చేస్తున్నప్పటికీ స్థానిక రోగులకు వ్యాక్సిన్ అందడం లేదని, ఇంజక్షన్ అంతకంటే లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఈ నెల 21న రాజీవ్ గాంధీ 30వ వర్ధంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా కరోనా రోగులకు సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు నిర్ణయించినట్లు వివరించారు. ప్రజలకు కరోనా పరీక్షలు చేయించడం, వాక్సిన్లు వేయించడం, మందులు, ఆహారం, మాస్కలు పంపిణీ చేయడం, అవసరమైన వారిని ఆసుపత్రికి చేర్చడం, బెడ్లు, ఇంజక్షన్లు, వెంటిలేటర్లు ఇప్పించడం లాంటి సహాయ చర్యలు తీసుకోవాలన్నారు.

ఇదీ చదవండి: రాగల రెండు రోజుల్లో తేలికపాటి వర్షాలు

తెలంగాణలో కరోనా వ్యాధి తీవ్ర స్థాయిలో విజృంభిస్తూ… ప్రజల ప్రాణాలను హరిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ పంచాయతీ రాజ్ విభాగం సోమవారం జూమ్‌ ద్వారా నిర్వహించిన సమావేశంలో సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలనుద్దేశించి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మాట్లాడారు.

ఇలాంటి పాలన ఎక్కడా లేదు

కరోనా విషయంలో కేసీఆర్ ప్రభుత్వం అత్యంత అవమానవీయంగా ప్రవర్తిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో రోగులను తరలించేందుకు అంబులెన్సులు లేవని, ఆస్పత్రుల్లో బెడ్లు లేవని, రోగులకు ఇంజక్షన్లు, మందులు దొరకడం లేదని ఇంత ఘోరమైన పాలన ఎక్కడ లేదని మండిపడ్డారు. పక్క రాష్ట్రాల్లో కరోనా వ్యాధికి ఉచిత చికిత్సలు చేస్తుంటే తెలంగాణలో ప్రైవేటు ఆస్పత్రులు నిలువునా దోచేస్తున్నా… ఎలాంటి నియంత్రణ చర్యలు లేవని ఆరోపించారు. ప్రపంచ దేశాలకు మందులు సరఫరా చేసే శక్తి కలిగిన తెలంగాణ రాష్ట్రానికి మందులు లేకుండా పోవడం దారుణమన్నారు.

ఈనెల 21న సహాయ కార్యక్రమాలు

హైదరాబాద్‌లో కొవాగ్జిన్ వ్యాక్సిన్, రెమ్​డిసివర్ ఇంజక్షన్లు తయారు చేస్తున్నప్పటికీ స్థానిక రోగులకు వ్యాక్సిన్ అందడం లేదని, ఇంజక్షన్ అంతకంటే లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఈ నెల 21న రాజీవ్ గాంధీ 30వ వర్ధంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా కరోనా రోగులకు సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు నిర్ణయించినట్లు వివరించారు. ప్రజలకు కరోనా పరీక్షలు చేయించడం, వాక్సిన్లు వేయించడం, మందులు, ఆహారం, మాస్కలు పంపిణీ చేయడం, అవసరమైన వారిని ఆసుపత్రికి చేర్చడం, బెడ్లు, ఇంజక్షన్లు, వెంటిలేటర్లు ఇప్పించడం లాంటి సహాయ చర్యలు తీసుకోవాలన్నారు.

ఇదీ చదవండి: రాగల రెండు రోజుల్లో తేలికపాటి వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.