ETV Bharat / state

Revanth Reddy: ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసిన రేవంత్​ రెడ్డి

author img

By

Published : Jul 6, 2021, 8:35 PM IST

ఉత్తమ్​ కుమార్​ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి కలిశారు. పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి ఉత్తమ్​ను ఆహ్వానించారు.

revanth reddy, uttam kumar reddy
రేవంత్​ రెడ్డి, ఉత్తమ్​ కుమార్​ రెడ్డి

హైదరాబాద్ బంజారాహిల్స్​లోని ఉత్తమ్​ కుమార్​ రెడ్డి నివాసంలో ఆయన్ను పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి కలిశారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలో మాట్లాడుకున్నారు. పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి రావాలని ఉత్తమ్​ను రేవంత్​ ఆహ్వానించారు. ఉత్తమ్​తో పాటు ఆయన సతీమణి పద్మ ఉన్నారు.

బిజీ బిజీగా..

పార్టీ సీనియర్​ నేతల్ని కలిసే పనిలో బిజీగా ఉన్న రేవంత్​ రెడ్డి.. ఇవాళ సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. కొన్ని రోజులుగా కలిసేందుకు రేవంత్​ రెడ్డి ప్రయత్నించగా... భట్టి నిరాకరిస్తూ వచ్చారు. ఈరోజు ఉదయం పీసీసీ సీనియర్​ ఉధ్యక్షుడు మల్లు రవితో చర్చల అనంతరం.. భట్టిని రేవంత్​ కలిసి.. రేపటి పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు.

మర్రికి, శ్రీధర్​బాబుకు ఆహ్వానాలు...

కాంగ్రెస్​ సీనియర్​ నేత మర్రి శశిధర్​రెడ్డిని రేవంత్​ కలిశారు. అపారమైన అనుభవం, కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు అందించిన మర్రి శశిధర్ రెడ్డి సలహాలతో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని రేవంత్​ తెలిపారు. అనంతరం మంథని ఎమ్మెల్యే శ్రీధర్​బాబును కలుసుకున్నారు. రేపటి కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని కలిసిన రేవంత్​ రెడ్డి పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి రావాలని కోరారు.

ఒంటి గంట 30 నిమిషాలకు బాధ్యతల స్వీకరణ

రేపు మధ్యాహ్నం ఒంటి గంట 30 నిమిషాలకు రేవంత్​ రెడ్డి బాధ్యతలు స్వీకరిస్తారు. అంతకంటే ముందు ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్​లోని పెద్దమ్మ తల్లి గుడిలో ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత నాంపల్లి దర్గాలో ప్రార్థనలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు గాంధీ భవన్​కు చేరుకుంటారు. బాధ్యతల స్వీకరణ అనంతరం బహిరంగ సభలో మాట్లాడాతారు.

ఇదీ చదవండి: Revanth Reddy : 'జోడెద్దుల్లా పనిచేసి.. పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం'

హైదరాబాద్ బంజారాహిల్స్​లోని ఉత్తమ్​ కుమార్​ రెడ్డి నివాసంలో ఆయన్ను పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి కలిశారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలో మాట్లాడుకున్నారు. పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి రావాలని ఉత్తమ్​ను రేవంత్​ ఆహ్వానించారు. ఉత్తమ్​తో పాటు ఆయన సతీమణి పద్మ ఉన్నారు.

బిజీ బిజీగా..

పార్టీ సీనియర్​ నేతల్ని కలిసే పనిలో బిజీగా ఉన్న రేవంత్​ రెడ్డి.. ఇవాళ సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. కొన్ని రోజులుగా కలిసేందుకు రేవంత్​ రెడ్డి ప్రయత్నించగా... భట్టి నిరాకరిస్తూ వచ్చారు. ఈరోజు ఉదయం పీసీసీ సీనియర్​ ఉధ్యక్షుడు మల్లు రవితో చర్చల అనంతరం.. భట్టిని రేవంత్​ కలిసి.. రేపటి పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు.

మర్రికి, శ్రీధర్​బాబుకు ఆహ్వానాలు...

కాంగ్రెస్​ సీనియర్​ నేత మర్రి శశిధర్​రెడ్డిని రేవంత్​ కలిశారు. అపారమైన అనుభవం, కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు అందించిన మర్రి శశిధర్ రెడ్డి సలహాలతో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని రేవంత్​ తెలిపారు. అనంతరం మంథని ఎమ్మెల్యే శ్రీధర్​బాబును కలుసుకున్నారు. రేపటి కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని కలిసిన రేవంత్​ రెడ్డి పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి రావాలని కోరారు.

ఒంటి గంట 30 నిమిషాలకు బాధ్యతల స్వీకరణ

రేపు మధ్యాహ్నం ఒంటి గంట 30 నిమిషాలకు రేవంత్​ రెడ్డి బాధ్యతలు స్వీకరిస్తారు. అంతకంటే ముందు ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్​లోని పెద్దమ్మ తల్లి గుడిలో ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత నాంపల్లి దర్గాలో ప్రార్థనలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు గాంధీ భవన్​కు చేరుకుంటారు. బాధ్యతల స్వీకరణ అనంతరం బహిరంగ సభలో మాట్లాడాతారు.

ఇదీ చదవండి: Revanth Reddy : 'జోడెద్దుల్లా పనిచేసి.. పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.