ETV Bharat / state

ప్రాణభయంతో.. ఛాంబర్ చుట్టూ తాడు కట్టించిన తహసీల్దార్..!

author img

By

Published : Nov 6, 2019, 9:21 PM IST

కర్నూలు జిల్లా పత్తికొండ తహసీల్దార్ ఉమామహేశ్వరి తీసుకున్న నిర్ణయం.. అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తహసీల్దార్ విజయారెడ్డి హత్య ఘటనతో భయపడిన ఆమె.. ఇలా చేసి వార్తల్లో నిలిచారు.

pattikonda mro umamaheshwari

పట్టపగలే మహిళా తహసీల్దార్ విజయారెడ్డి​ హత్యకు గురైన ఘటన నుంచి తెలుగు రాష్ట్రాల్లోని అధికారులు కోలుకోలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా పత్తికొండ తహసీల్దార్ ఉమామహేశ్వరి.. కార్యాలయంలోని తన ఛాంబర్‌ చుట్టూ తాడు కట్టుకున్నారు. కార్యాలయానికి వచ్చిన వారు దీనిని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఆర్జీలు ఇచ్చేవారు తాడు బయట నుంచే ఇవ్వాలని, ఎవరూ తాడు దాటి లోపలికి రాకుండా చూడాలని తన సిబ్బందిని ఆదేశించారు ఉమామహేశ్వరి. విజయారెడ్డికి హత్య తనను భయాందోళనకు గురి చేసిందని అన్నారు. ముందు జాగ్రత్త చర్యగా తాడుతో రక్షణ ఏర్పాటు చేసుకున్నానని బదులిచ్చారు.

ప్రాణభయంతో.. ఛాంబర్ చుట్టూ తాడు కట్టించిన తహసీల్దార్..!

ఇవీ చూడండి:తహసీల్దార్ విజయారెడ్డి​ హత్య వెనుక ఎవరి ప్రమేయం ఉంది?

పట్టపగలే మహిళా తహసీల్దార్ విజయారెడ్డి​ హత్యకు గురైన ఘటన నుంచి తెలుగు రాష్ట్రాల్లోని అధికారులు కోలుకోలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా పత్తికొండ తహసీల్దార్ ఉమామహేశ్వరి.. కార్యాలయంలోని తన ఛాంబర్‌ చుట్టూ తాడు కట్టుకున్నారు. కార్యాలయానికి వచ్చిన వారు దీనిని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఆర్జీలు ఇచ్చేవారు తాడు బయట నుంచే ఇవ్వాలని, ఎవరూ తాడు దాటి లోపలికి రాకుండా చూడాలని తన సిబ్బందిని ఆదేశించారు ఉమామహేశ్వరి. విజయారెడ్డికి హత్య తనను భయాందోళనకు గురి చేసిందని అన్నారు. ముందు జాగ్రత్త చర్యగా తాడుతో రక్షణ ఏర్పాటు చేసుకున్నానని బదులిచ్చారు.

ప్రాణభయంతో.. ఛాంబర్ చుట్టూ తాడు కట్టించిన తహసీల్దార్..!

ఇవీ చూడండి:తహసీల్దార్ విజయారెడ్డి​ హత్య వెనుక ఎవరి ప్రమేయం ఉంది?

Intro:Body:

ప్రాణభయంతో.. కార్యాలయంలో.. ఛాంబర్ చుట్టూ తాడు!



తెలంగాణలో హత్య.. కర్నూలు జిల్లా పత్తికొండలో తాడు



తెలంగాణలో పట్టపగలే తహసీల్దార్​ హత్యకు గురైన ఘటన నుంచి అధికారులు కోలుకోలేకపోతున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ తహసీల్దార్ ఉమామహేశ్వరి.. కార్యాలయంలోని తన ఛాంబర్‌ చుట్టూ తాడు కట్టుకున్నారు. కార్యాలయానికి వచ్చిన వారు ఈ సంఘటన చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. అర్జీలు ఇచ్చేవారు తాడు బయటనుంచే ఇవ్వాలని, ఎవరూ తాడు దాటి లోపలికి రాకుండా చూడాలని తన సిబ్బందిని ఆదేశించారు. ఈ పరిణామంపై తహసీల్దార్‌ను ఆరాతీయగా... హైదరాబాద్‌ శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి సజీవదహనం తర్వాత భయానికి గురైనట్లు చెప్పారు. ముందు జాగ్రత్త చర్యగా తాడుతో రక్షణ ఏర్పాటు చేసుకున్నానని బదులిచ్చారు.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.