ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా పత్తికొండ తహసీల్దార్ ఉమామహేశ్వరి.. కార్యాలయంలో తన ఛాంబర్ చుట్టూ తాడు కట్టుకున్నారు. కార్యాలయానికి వచ్చిన వారు ఆ తాడు చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. అర్జీలు ఇచ్చేవారు తాడు బయటనుంచే ఇవ్వాలని, ఎవరూ లోపలికి రాకుండా చూడాలని సిబ్బందిని తహసీల్దార్ ఆదేశించారు. ఈ పరిణామంపై ఆమెను ఆరాతీయగా... హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం తర్వాత భయానికి గురైనట్లు చెప్పారు. ముందు జాగ్రత్త చర్యగా తాడుతో రక్షణ ఏర్పాటు చేసుకున్నానని బదులిచ్చారు.
ఇదీ చదవండిః ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన విజయారెడ్డి అంత్యక్రియలు