ETV Bharat / state

ప్రాణభయంతో.. ఛాంబర్ చుట్టూ తాడు కట్టించిన తహసీల్దార్!! - pattikonda mro umamaheshwari

కర్నూలు జిల్లా పత్తికొండ తహసీల్దార్ ఉమామహేశ్వరి తీసుకున్న నిర్ణయం.. అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్ హత్య ఘటనతో భయపడిన ఆమె.. అలా చేసి వార్తల్లో నిలిచారు.

mro
author img

By

Published : Nov 6, 2019, 12:06 PM IST

Updated : Nov 6, 2019, 12:47 PM IST

ప్రాణభయంతో.. ఛాంబర్ చుట్టూ తాడు కట్టించిన తహసీల్దార్!!

ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా పత్తికొండ తహసీల్దార్ ఉమామహేశ్వరి.. కార్యాలయంలో తన ఛాంబర్‌ చుట్టూ తాడు కట్టుకున్నారు. కార్యాలయానికి వచ్చిన వారు ఆ తాడు చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. అర్జీలు ఇచ్చేవారు తాడు బయటనుంచే ఇవ్వాలని, ఎవరూ లోపలికి రాకుండా చూడాలని సిబ్బందిని తహసీల్దార్​ ఆదేశించారు. ఈ పరిణామంపై ఆమెను ఆరాతీయగా... హైదరాబాద్‌ శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి సజీవదహనం తర్వాత భయానికి గురైనట్లు చెప్పారు. ముందు జాగ్రత్త చర్యగా తాడుతో రక్షణ ఏర్పాటు చేసుకున్నానని బదులిచ్చారు.

ఇదీ చదవండిః ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన విజయారెడ్డి అంత్యక్రియలు

ప్రాణభయంతో.. ఛాంబర్ చుట్టూ తాడు కట్టించిన తహసీల్దార్!!

ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా పత్తికొండ తహసీల్దార్ ఉమామహేశ్వరి.. కార్యాలయంలో తన ఛాంబర్‌ చుట్టూ తాడు కట్టుకున్నారు. కార్యాలయానికి వచ్చిన వారు ఆ తాడు చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. అర్జీలు ఇచ్చేవారు తాడు బయటనుంచే ఇవ్వాలని, ఎవరూ లోపలికి రాకుండా చూడాలని సిబ్బందిని తహసీల్దార్​ ఆదేశించారు. ఈ పరిణామంపై ఆమెను ఆరాతీయగా... హైదరాబాద్‌ శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి సజీవదహనం తర్వాత భయానికి గురైనట్లు చెప్పారు. ముందు జాగ్రత్త చర్యగా తాడుతో రక్షణ ఏర్పాటు చేసుకున్నానని బదులిచ్చారు.

ఇదీ చదవండిః ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన విజయారెడ్డి అంత్యక్రియలు

Intro:Body:

ప్రాణభయంతో.. కార్యాలయంలో.. ఛాంబర్ చుట్టూ తాడు!



తెలంగాణలో హత్య.. కర్నూలు జిల్లా పత్తికొండలో తాడు



తెలంగాణలో పట్టపగలే తహసీల్దార్​ హత్యకు గురైన ఘటన నుంచి అధికారులు కోలుకోలేకపోతున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ తహసీల్దార్ ఉమామహేశ్వరి.. కార్యాలయంలోని తన ఛాంబర్‌ చుట్టూ తాడు కట్టుకున్నారు. కార్యాలయానికి వచ్చిన వారు ఈ సంఘటన చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. అర్జీలు ఇచ్చేవారు తాడు బయటనుంచే ఇవ్వాలని, ఎవరూ తాడు దాటి లోపలికి రాకుండా చూడాలని తన సిబ్బందిని ఆదేశించారు. ఈ పరిణామంపై తహసీల్దార్‌ను ఆరాతీయగా... హైదరాబాద్‌ శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి సజీవదహనం తర్వాత భయానికి గురైనట్లు చెప్పారు. ముందు జాగ్రత్త చర్యగా తాడుతో రక్షణ ఏర్పాటు చేసుకున్నానని బదులిచ్చారు.


Conclusion:
Last Updated : Nov 6, 2019, 12:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.