రాష్ట్రంలో లాక్డౌన్ పది రోజులు పొడిగించినందున సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయ ప్రాంగణంలో పాస్పోర్ట్ ప్రాసెసింగ్ కౌంటర్ (Passport processing counter) అన్ని పనిదినాల్లో పని చేస్తుందని ఆర్పీఓ దాసరి బాలయ్య తెలిపారు. జూన్ 9 వరకు లాక్డౌన్ అమలులో ఉంటున్నందున అన్ని పని దినాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు.
విదేశాలకు అత్యవసర ప్రయాణాలు చేయదలిచిన వారి కోసం ఈ ప్రత్యేక కౌంటర్ పని చేస్తుందని ఆయన తెలిపారు. మే 12 నుంచి రాష్ట్రంలో లాక్డౌన్ అమలు అవుతుండడంతో ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని పాస్పోర్టు సేవా కేంద్రాలు పాస్ పోర్టుల జారీ ప్రక్రియను నిలిపివేసిన విషయాన్ని గుర్తు చేశారు.