ETV Bharat / state

CPGET: ఒకే తరహా కోర్సులకు ఒక్కటే ప్రశ్నపత్రం.. పీజీ ప్రవేశార్హతల్లో మార్పులు

author img

By

Published : May 14, 2022, 4:59 AM IST

CPGET: పీజీ ప్రవేశార్హతల్లో భారీగా మార్పులు రానున్నాయి. ఇకపై ఒకే తరహా కోర్సులకు ఒక్కటే ప్రశ్నపత్రం ఇవ్వనున్నారు. జాతీయ కోటాను 5 నుంచి 10 శాతానికి పెంచే యోచనలో ఉన్నారు. సీపీగెట్‌లో ఈసారి భారీ సంస్కరణలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం కసరత్తు ప్రారంభించింది.

PG COURSES
పీజీ ప్రవేశార్హతల్లో మార్పులు

CPGET: డిగ్రీలో ఏ కోర్సు చేసినా బేఫికర్‌... పీజీ చదివేందుకు అవకాశమున్న కోర్సులన్నిటికీ కలిపి ఈసారి ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష(సీపీగెట్‌)లో భాగంగా ఒకటే ప్రశ్నపత్రం ఇవ్వనున్నారు. ఒకే రకం కోర్సులకు కలిపి ఒకటే పరీక్ష జరపాలని, సాధ్యమైనంతలో పరీక్షల సంఖ్య తగ్గించి విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఉన్నత విద్యామండలి సూచించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం చేస్తున్న కసరత్తు తుదిదశకు వచ్చింది. మరికొన్ని మార్పులు చేయాలని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలోని ఓయూ, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన వర్సిటీల్లోని అన్ని పీజీ కోర్సులతోపాటు జేఎన్‌టీయూహెచ్‌లోని సైన్స్‌ పీజీ కోర్సుల్లో సీట్ల భర్తీకి 2019 నుంచి సీపీగెట్‌ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం దాదాపు 75 పీజీ కోర్సుల్లో ప్రవేశానికి వేర్వేరుగా ప్రవేశపరీక్షలు జరపాల్సి వస్తోంది. విద్యార్థులు రెండు, మూడు పరీక్షలు రాయాల్సి వస్తోంది. ఫలితంగా విద్యా సంవత్సరం ఆలస్యమవుతోంది. అందుకే పరీక్షల సంఖ్యను తగ్గించాలన్న లక్ష్యంతో సీపీగెట్‌ అధికారులు 20 రోజులుగా అధ్యయనం చేస్తున్నారు. దేశంలోని వివిధ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఇప్పటికే సారూప్య సబ్జెక్టులకు కలిపి ఒకటే ప్రశ్నపత్రం ఇచ్చే విధానాన్ని అమలు చేస్తున్నారు.

* మాస్టర్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ జర్నలిజం, ఎంఎల్‌ఐసీ, హ్యూమన్‌ రీసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, టూరిజం మేనేజ్‌మెంట్‌, ఎంఏ సోషియాలజీ, ఎంఏ సోషల్‌ వర్క్‌, ఎంఏ ఆర్కియాలజీ తదితర కోర్సులకు డిగ్రీలో ఏ కోర్సు చేసినవారైనా అర్హులే. ప్రస్తుతం వాటికోసం వేర్వేరుగా పరీక్షలు జరుపుతున్నారు. ఈసారి ఒకటే పరీక్ష నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చారు.

* ఇప్పటివరకు పొలిటికల్‌ సైన్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ సబ్జెక్టులకు వేర్వేరు ప్రవేశపరీక్షలు జరుపుతున్నారు. ఈసారి ఒకే పరీక్ష నిర్వహిస్తారు. ఉత్తీర్ణులు రెంటిలో ఏదోఒక కోర్సులో చేరవచ్చు.

* పీజీ కోర్సుల్లో ఇతర రాష్ట్రాలవారికి నేషనల్‌ ఇంటిగ్రేషన్‌ కోటా కింద 5శాతం సీట్లిస్తున్నారు. ఈసారి కోటా 10 శాతానికి పెంచనున్నారు.

అర్హతలు మార్చాలి... ముందుగా చెప్పాలి:ఎంఏ చరిత్ర, ఆర్థికశాస్త్రం వంటి కోర్సుల్లో చేరాలంటే ప్రస్తుతం డిగ్రీలో ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. పరీక్ష ఎవరైనా రాయవచ్చు. ప్రవేశాలకూ ఆ నిబంధన మారుద్దామా?.. అన్న కోణంలో అధికారులు చర్చిస్తున్నారు. ఎంఏ చరిత్ర చదవాలంటే బీఏలో చరిత్రనే తప్పక ఎందుకు చదవాలి? అన్న ప్రశ్న తలెత్తుతోంది. నూతన విద్యావిధానం ప్రకారం అది సమంజసమని కొందరంటున్నారు. అయితే ఏ డిగ్రీ చేసినవారైనా ఎంఏ చరిత్ర చదవొచ్చు.. అని చెబితే సివిల్స్‌కు సిద్ధమయ్యే బీటెక్‌ విద్యార్థులకే ఓయూలో సీట్లు దక్కుతాయన్నారు ఓ ఆచార్యుడు. ఒకవేళ నిబంధనలు మార్చాలంటే ముందుగా ప్రకటించాలన్న అభిప్రాయమూ ఉంది.

ఇవీ చూడండి: 'చిత్తశుద్ధి ఉంటే సమాధానాలు చెప్పాలి..'- అమిత్​షాకు కేటీఆర్​ బహిరంగ లేఖ

దిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. 27 మంది సజీవ దహనం

CPGET: డిగ్రీలో ఏ కోర్సు చేసినా బేఫికర్‌... పీజీ చదివేందుకు అవకాశమున్న కోర్సులన్నిటికీ కలిపి ఈసారి ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష(సీపీగెట్‌)లో భాగంగా ఒకటే ప్రశ్నపత్రం ఇవ్వనున్నారు. ఒకే రకం కోర్సులకు కలిపి ఒకటే పరీక్ష జరపాలని, సాధ్యమైనంతలో పరీక్షల సంఖ్య తగ్గించి విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఉన్నత విద్యామండలి సూచించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం చేస్తున్న కసరత్తు తుదిదశకు వచ్చింది. మరికొన్ని మార్పులు చేయాలని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలోని ఓయూ, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన వర్సిటీల్లోని అన్ని పీజీ కోర్సులతోపాటు జేఎన్‌టీయూహెచ్‌లోని సైన్స్‌ పీజీ కోర్సుల్లో సీట్ల భర్తీకి 2019 నుంచి సీపీగెట్‌ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం దాదాపు 75 పీజీ కోర్సుల్లో ప్రవేశానికి వేర్వేరుగా ప్రవేశపరీక్షలు జరపాల్సి వస్తోంది. విద్యార్థులు రెండు, మూడు పరీక్షలు రాయాల్సి వస్తోంది. ఫలితంగా విద్యా సంవత్సరం ఆలస్యమవుతోంది. అందుకే పరీక్షల సంఖ్యను తగ్గించాలన్న లక్ష్యంతో సీపీగెట్‌ అధికారులు 20 రోజులుగా అధ్యయనం చేస్తున్నారు. దేశంలోని వివిధ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఇప్పటికే సారూప్య సబ్జెక్టులకు కలిపి ఒకటే ప్రశ్నపత్రం ఇచ్చే విధానాన్ని అమలు చేస్తున్నారు.

* మాస్టర్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ జర్నలిజం, ఎంఎల్‌ఐసీ, హ్యూమన్‌ రీసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, టూరిజం మేనేజ్‌మెంట్‌, ఎంఏ సోషియాలజీ, ఎంఏ సోషల్‌ వర్క్‌, ఎంఏ ఆర్కియాలజీ తదితర కోర్సులకు డిగ్రీలో ఏ కోర్సు చేసినవారైనా అర్హులే. ప్రస్తుతం వాటికోసం వేర్వేరుగా పరీక్షలు జరుపుతున్నారు. ఈసారి ఒకటే పరీక్ష నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చారు.

* ఇప్పటివరకు పొలిటికల్‌ సైన్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ సబ్జెక్టులకు వేర్వేరు ప్రవేశపరీక్షలు జరుపుతున్నారు. ఈసారి ఒకే పరీక్ష నిర్వహిస్తారు. ఉత్తీర్ణులు రెంటిలో ఏదోఒక కోర్సులో చేరవచ్చు.

* పీజీ కోర్సుల్లో ఇతర రాష్ట్రాలవారికి నేషనల్‌ ఇంటిగ్రేషన్‌ కోటా కింద 5శాతం సీట్లిస్తున్నారు. ఈసారి కోటా 10 శాతానికి పెంచనున్నారు.

అర్హతలు మార్చాలి... ముందుగా చెప్పాలి:ఎంఏ చరిత్ర, ఆర్థికశాస్త్రం వంటి కోర్సుల్లో చేరాలంటే ప్రస్తుతం డిగ్రీలో ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. పరీక్ష ఎవరైనా రాయవచ్చు. ప్రవేశాలకూ ఆ నిబంధన మారుద్దామా?.. అన్న కోణంలో అధికారులు చర్చిస్తున్నారు. ఎంఏ చరిత్ర చదవాలంటే బీఏలో చరిత్రనే తప్పక ఎందుకు చదవాలి? అన్న ప్రశ్న తలెత్తుతోంది. నూతన విద్యావిధానం ప్రకారం అది సమంజసమని కొందరంటున్నారు. అయితే ఏ డిగ్రీ చేసినవారైనా ఎంఏ చరిత్ర చదవొచ్చు.. అని చెబితే సివిల్స్‌కు సిద్ధమయ్యే బీటెక్‌ విద్యార్థులకే ఓయూలో సీట్లు దక్కుతాయన్నారు ఓ ఆచార్యుడు. ఒకవేళ నిబంధనలు మార్చాలంటే ముందుగా ప్రకటించాలన్న అభిప్రాయమూ ఉంది.

ఇవీ చూడండి: 'చిత్తశుద్ధి ఉంటే సమాధానాలు చెప్పాలి..'- అమిత్​షాకు కేటీఆర్​ బహిరంగ లేఖ

దిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. 27 మంది సజీవ దహనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.