ETV Bharat / state

జర్నలిస్టులకు ఓయూ జేఏసీ ఛైర్మన్​ చేయూత

author img

By

Published : Apr 23, 2020, 3:11 PM IST

కరోనా వంటి ఆపత్కర పరిస్థితుల్లో ప్రజలను జాగృతం చేయడానికి ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహిస్తోన్న జర్నలిస్టులకు తెరాస నేత, ఓయూ జేఏసీ​ ఛైర్మన్​ రాజు కృతజ్ఞతలు తెలిపారు. వారికి చేయూతనివ్వడానికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

ou jac distributed groceries to journalists
జర్నలిస్టులకు ఓయూ జేఏసీ ఛైర్మన్​ చేయూత

కరోనా వంటి ప్రమాదకర వైరస్​ విలయతాండవం చేస్తున్న పరిస్థితుల్లోనూ... జర్నలిస్టులు వార్తలు సేకరిస్తూ ప్రజల్ని జాగృతం చేస్తున్నారని ఓయూ జేఏసీ ఛైర్మన్​ డాక్టర్​ రాజు అన్నారు. ప్రాణాలు పణంగా పెట్టి సేవలందిస్తోన్న వారికి... ప్రతి ఒక్కరు తమకు తోచినంత సాయం చేయాలని కోరారు.

ఓయూ ఆర్ట్స్​ కళాశాల వద్ద విలేకర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఓయూలో చదివి ఉన్నత స్థాయిలో ఉన్నవారు కూడా తమ గ్రామాలకు చెందిన పేదలకు సాయపడాలని, సీఎం నిధికి విరాళాలు అందజేయాలని విజ్ఞప్తి చేశారు.

కరోనా వంటి ప్రమాదకర వైరస్​ విలయతాండవం చేస్తున్న పరిస్థితుల్లోనూ... జర్నలిస్టులు వార్తలు సేకరిస్తూ ప్రజల్ని జాగృతం చేస్తున్నారని ఓయూ జేఏసీ ఛైర్మన్​ డాక్టర్​ రాజు అన్నారు. ప్రాణాలు పణంగా పెట్టి సేవలందిస్తోన్న వారికి... ప్రతి ఒక్కరు తమకు తోచినంత సాయం చేయాలని కోరారు.

ఓయూ ఆర్ట్స్​ కళాశాల వద్ద విలేకర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఓయూలో చదివి ఉన్నత స్థాయిలో ఉన్నవారు కూడా తమ గ్రామాలకు చెందిన పేదలకు సాయపడాలని, సీఎం నిధికి విరాళాలు అందజేయాలని విజ్ఞప్తి చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.