ETV Bharat / state

ఉస్మానియా శిథిలావస్థకు చేరింది.. చర్యలు చేపట్టండి: బండి సంజయ్​ - ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించిన భాజపా బృందం వార్తలు

ఉస్మానియా ఆసుపత్రి పరిస్థితి దయనీయంగా మారిందని భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్​ ఆరోపించారు. శిథిలావస్థకు చేరిన దవాఖాన అభివృద్ధికై ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని డిమాండ్​ చేశారు. పార్టీ నేతలతో కలిసి ఆసుపత్రిలోని తాజా పరిస్థితులను పరిశీలించారు.

Osmania is in a cool situation .. Take action: Bandi Sanjay
ఉస్మానియా శిథిలావస్థకు చేరింది.. చర్యలు చేపట్టండి: బండి సంజయ్​
author img

By

Published : Jul 16, 2020, 11:41 AM IST

హైదరాబాద్ పాతబస్తీలోని ఉస్మానియా ఆసుపత్రిని భాజపా బృందం సందర్శించింది. రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్​ నేతృత్వంలో నేతలు ఆసుపత్రిలోని తాజా పరిస్థితులను పరిశీలించారు. అందుతున్న వైద్యసేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు.

హైదరాబాద్​లో ఎంతో పేరు గాంచిన ఉస్మానియా ఆసుపత్రి పరిస్థితి దయనీయంగా మారిందని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.​ చిన్నపాటి వర్షానికే దవాఖాన వరద నీటితో నిండిపోయిందని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న ఆయన.. రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ అంశంపై నోరు విప్పడం లేదంటూ మండిపడ్డారు.

ముఖ్యమంత్రి కేసీఆర్​కు ప్రాజెక్టుల మీద ఉన్న శ్రద్ధ.. శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ అసుత్రులపై లేదని సంజయ్​ విమర్శించారు. కార్పొరేట్ అసుత్రుల్లో దోపిడీని అరికట్టడంలో సీఎం విఫలమయ్యారన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చమని అడిగితే కనీసం స్పందించలేదని అన్నారు.

ఉస్మానియా ఆసుపత్రి కూలే పరిస్థితిలో ఉందని.. తక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆసుపత్రిని సందర్శించాలని సూచించారు. ఉస్మానియా అభివృద్ధిపై తక్షణమే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్​ చేశారు.

ఉస్మానియా శిథిలావస్థకు చేరింది.. చర్యలు చేపట్టండి: బండి సంజయ్​

ఇదీచూడండి: తహసీల్దారు కార్యాలయాల్లో ఫిర్యాదుల పెట్టెలు.. ఎందుకంటే?

హైదరాబాద్ పాతబస్తీలోని ఉస్మానియా ఆసుపత్రిని భాజపా బృందం సందర్శించింది. రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్​ నేతృత్వంలో నేతలు ఆసుపత్రిలోని తాజా పరిస్థితులను పరిశీలించారు. అందుతున్న వైద్యసేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు.

హైదరాబాద్​లో ఎంతో పేరు గాంచిన ఉస్మానియా ఆసుపత్రి పరిస్థితి దయనీయంగా మారిందని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.​ చిన్నపాటి వర్షానికే దవాఖాన వరద నీటితో నిండిపోయిందని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న ఆయన.. రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ అంశంపై నోరు విప్పడం లేదంటూ మండిపడ్డారు.

ముఖ్యమంత్రి కేసీఆర్​కు ప్రాజెక్టుల మీద ఉన్న శ్రద్ధ.. శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ అసుత్రులపై లేదని సంజయ్​ విమర్శించారు. కార్పొరేట్ అసుత్రుల్లో దోపిడీని అరికట్టడంలో సీఎం విఫలమయ్యారన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చమని అడిగితే కనీసం స్పందించలేదని అన్నారు.

ఉస్మానియా ఆసుపత్రి కూలే పరిస్థితిలో ఉందని.. తక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆసుపత్రిని సందర్శించాలని సూచించారు. ఉస్మానియా అభివృద్ధిపై తక్షణమే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్​ చేశారు.

ఉస్మానియా శిథిలావస్థకు చేరింది.. చర్యలు చేపట్టండి: బండి సంజయ్​

ఇదీచూడండి: తహసీల్దారు కార్యాలయాల్లో ఫిర్యాదుల పెట్టెలు.. ఎందుకంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.