హైదరాబాద్ గోల్కొండలోని కేంద్రీయ విద్యాలయంలో జాతీయ సమైక్యతా శిబిరం ప్రారంభమైంది. విద్యార్థులలో జాతీయ సమైక్యతను పెంపొందించి, కళలపట్ల అభిరుచిని పెంచడానికి ఇలాంటి శిబిరాల ఆవశ్యకత ఉందని నిర్వాహకులు జయ పి రాజప్పన్ తెలిపారు. ఈ శిబిరంలో పదకొండు వందల మంది విద్యార్థులు పాల్గొంటున్నారని ఆమె అన్నారు. భారత సమైక్యతను పెంపొందించే విధంగా రాజస్థాన్ రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: కర్ణాటక సభాపతి రమేశ్ కుమార్ రాజీనామా