ETV Bharat / state

Sri Rama Shobhayatra: భాగ్యనగరంలో వైభవంగా సాగుతోన్న శ్రీరామ శోభాయాత్ర

author img

By

Published : Apr 10, 2022, 2:52 PM IST

Sri Rama Shobhayatra: హైదరాబాద్‌లో శ్రీరామ శోభాయాత్ర వైభవంగా సాగుతోంది. కరోనా వల్ల రెండేళ్లుగా నిర్వహించని శోభాయాత్రను ఈసారి ఘనంగా నిర్వహిస్తున్నారు. భాగ్యనగర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అట్టహసంగా శోభాయాత్రను నిర్వహిస్తున్నారు.

Shobhayatra
Shobhayatra

Sri Rama Shobhayatra: భాగ్యనగరంలో శ్రీరామ శోభాయాత్ర కొనసాగుతోంది. భాగ్యనగర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామ శోభాయాత్ర వైభవంగా సాగుతోంది. సీతారాంబాగ్ నుంచి హనుమాన్ టేక్డీ వరకు సాగనుంది. ధూల్‌పేట, జాలీ హనుమాన్, చుడీబజార్ మీదుగా సాగి... రాత్రి 8 గంటలకు ముగియనుంది. రెండేళ్ల తరువాత హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర జరుగుతోంది. కరోనా మహమ్మారి వల్ల గత రెండేళ్లు శ్రీరామ శోభాయాత్ర నిర్వహించలేదు. ఈసారి ఎలాంటి నిబంధనలు లేకపోవడం వల్ల అట్టహాసంగా శోభాయాత్రను నిర్వహిస్తున్నారు.

Shobhayatra
Shobhayatra

శోభాయాత్ర మార్గంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట భద్రత కల్పించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు మోహరించి... సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేశారు.

Shobhayatra
శోభాయాత్ర

ట్రాఫిక్ ఆంక్షలు అమలు: శ్రీరామనవమి శోభాయాత్ర కొనసాగే మార్గాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. శోభాయాత్ర సమయంలో ఆయా రహదారుల మీదుగా వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్నారు. వాహనాలను దారి మళ్లించి ఇతర రహదారుల మీదుగా వెళ్లేలా చూస్తున్నారు. గోషామహల్, సుల్తాన్ బజార్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆంక్షలు విధించారు. బోయగూడ కమాన్, పురానాపూల్, జుమేరాత్ బజార్, చుడీబజార్, బేగంబజార్ చత్రి, గౌలిగూడ కమాన్, గురుద్వారా, పుత్లిబౌలి చౌరస్తా, కోఠి ఆంధ్రా బ్యాంక్ మీదుగా సుల్తాన్ బజార్​లోని హనుమాన్ వ్యాయామశాలకు శోభాయాత్ర చేరుకుంటుంది.

Shobhayatra
శ్రీరామ శోభాయాత్ర ప్రారంభం

ఆయా మార్గాల్లో శోభాయాత్ర ముగిసిన వెంటనే... బారికేడ్లు తీసి వాహనాల రాకపోకలకు అనుమతించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనదారులు శోభాయాత్రకు సంబంధించిన సమాచారం కోసం ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ నెంబర్ 040 2785 2482, హెల్ప్ లైన్ 9010203626 నంబర్లకు ఫోన్ చేయాలని... హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు పేరిట సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదు చేయొచ్చని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

మద్యం దుకాణాలు, బార్‌లు మూసివేత: హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్ల పరిధిలోని మద్యం దుకాణాలు, బార్‌లు మూసివేశారు. సోమవారం ఉదయం ఆరు గంటల వరకు మూసివేస్తారు. వాహనదారులు ఆంక్షలు పాటించి పోలీసులకు సహకరించాలని పోలీసులు కోరారు.

ఇదీ చూడండి: భద్రాచలంలో వైభవంగా శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం

సీత కథ.. మనకూ పాఠమే!


Sri Rama Shobhayatra: భాగ్యనగరంలో శ్రీరామ శోభాయాత్ర కొనసాగుతోంది. భాగ్యనగర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామ శోభాయాత్ర వైభవంగా సాగుతోంది. సీతారాంబాగ్ నుంచి హనుమాన్ టేక్డీ వరకు సాగనుంది. ధూల్‌పేట, జాలీ హనుమాన్, చుడీబజార్ మీదుగా సాగి... రాత్రి 8 గంటలకు ముగియనుంది. రెండేళ్ల తరువాత హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర జరుగుతోంది. కరోనా మహమ్మారి వల్ల గత రెండేళ్లు శ్రీరామ శోభాయాత్ర నిర్వహించలేదు. ఈసారి ఎలాంటి నిబంధనలు లేకపోవడం వల్ల అట్టహాసంగా శోభాయాత్రను నిర్వహిస్తున్నారు.

Shobhayatra
Shobhayatra

శోభాయాత్ర మార్గంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట భద్రత కల్పించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు మోహరించి... సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేశారు.

Shobhayatra
శోభాయాత్ర

ట్రాఫిక్ ఆంక్షలు అమలు: శ్రీరామనవమి శోభాయాత్ర కొనసాగే మార్గాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. శోభాయాత్ర సమయంలో ఆయా రహదారుల మీదుగా వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్నారు. వాహనాలను దారి మళ్లించి ఇతర రహదారుల మీదుగా వెళ్లేలా చూస్తున్నారు. గోషామహల్, సుల్తాన్ బజార్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆంక్షలు విధించారు. బోయగూడ కమాన్, పురానాపూల్, జుమేరాత్ బజార్, చుడీబజార్, బేగంబజార్ చత్రి, గౌలిగూడ కమాన్, గురుద్వారా, పుత్లిబౌలి చౌరస్తా, కోఠి ఆంధ్రా బ్యాంక్ మీదుగా సుల్తాన్ బజార్​లోని హనుమాన్ వ్యాయామశాలకు శోభాయాత్ర చేరుకుంటుంది.

Shobhayatra
శ్రీరామ శోభాయాత్ర ప్రారంభం

ఆయా మార్గాల్లో శోభాయాత్ర ముగిసిన వెంటనే... బారికేడ్లు తీసి వాహనాల రాకపోకలకు అనుమతించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనదారులు శోభాయాత్రకు సంబంధించిన సమాచారం కోసం ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ నెంబర్ 040 2785 2482, హెల్ప్ లైన్ 9010203626 నంబర్లకు ఫోన్ చేయాలని... హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు పేరిట సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదు చేయొచ్చని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

మద్యం దుకాణాలు, బార్‌లు మూసివేత: హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్ల పరిధిలోని మద్యం దుకాణాలు, బార్‌లు మూసివేశారు. సోమవారం ఉదయం ఆరు గంటల వరకు మూసివేస్తారు. వాహనదారులు ఆంక్షలు పాటించి పోలీసులకు సహకరించాలని పోలీసులు కోరారు.

ఇదీ చూడండి: భద్రాచలంలో వైభవంగా శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం

సీత కథ.. మనకూ పాఠమే!


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.