సీఎం కేసీఆర్ 67 వ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 17న హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో అధి శ్రవణ మహా రుద్రయాగం నిర్వహిస్తున్నట్లు... రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, అభివృద్ధి కోసం ఈ యాగాన్ని తలపెట్టినట్లు ఆయన చెప్పారు. దోమలగూడలో బ్రహ్మశ్రీ ఈశ్వర సురేష్ శర్మ తదితరులతో కలిసి మహా రుద్రయాగం గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు.
రాష్ట్రంలో ఎప్పుడు, ఎక్కడా జరగని విధంగా అధి శ్రవణ మహా రుద్రయాగాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ యాగానికి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలను ఆహ్వానించనున్నట్లు చెప్పారు. యాగం చేయడం వల్ల రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని అన్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
ఇదీ చదవండి: కొండగట్టు అంజన్న దర్శనానికి బారులుతీరిన భక్తులు