ETV Bharat / state

అనారోగ్యంతో ఉన్నా విధులకు రమ్మంటున్నారని నర్సుల ఆందోళన

author img

By

Published : Jul 19, 2020, 6:32 PM IST

Updated : Jul 19, 2020, 7:24 PM IST

హైదరాబాద్​ మహా నగరంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యం తమను వేధిస్తోందని నర్సింగ్ సిబ్బంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తమకు కరోనా వైరస్ లక్షణాలున్నప్పటికీ... కొవిడ్ విధులు కేటాయించారని వాపోయారు. తమకు జ్వరం వచ్చినా.. ఆస్పత్రికి వచ్చి విధులు నిర్వర్తించాలని యాజమాన్యం ఒత్తిడి చేయడం పట్ల బాధిత నర్సులు ఆవేదవ వ్యక్తం చేశారు.

కరోనా సోకినా చికిత్స అందించమంటున్నారు : బాధిత నర్సులు
కరోనా సోకినా చికిత్స అందించమంటున్నారు : బాధిత నర్సులు

హైదరాబాద్‌ మెహిదీపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో దారుణ పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి. తమిళనాడు నుంచి వచ్చి హైదరాబాద్​లోని ఆలివ్‌ ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్న తమను యాజమాన్యం వేధిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తమను నిర్భందించి కొవిడ్ డ్యూటీలు చేయిస్తున్నారని బాధిత నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు 101, 102 డిగ్రీల జ్వరం ఉన్నప్పటికీ... విధులకు తప్పనిసరిగా హాజరవ్వాలంటూ యాజమాన్యం ఒత్తిడి చేయడం పట్ల తాము మనోవేదనకు గురవుతున్నట్లు బాధితులు పేర్కొన్నారు. విధులకు హాజరు కాకుంటే యాజమాన్యం సమకూర్చిన వసతి గృహాన్ని వెంటనే ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని భయాందోళన వ్యక్తం చేశారు.

మీరే ఆదుకోవాలి...

తమను ఆదుకోవాలని తెలంగాణ నర్సింగ్ సమితికి బాధితులు లేఖ రాశారు. ఇప్పటికే ఎంతో మంది నర్సులకు కరోనా వైరస్ సోకిందని.. వ్యాధి లక్షణాలున్నప్పటికీ విధులకు రావాలంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారని వాపోయారు. తెలంగాణ ప్రభుత్వం మీద తమకు నమ్మకముందని... తమను రక్షించాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి : మహిళ మృతి.. భయంతో యువకుడి బలవన్మరణం

హైదరాబాద్‌ మెహిదీపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో దారుణ పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి. తమిళనాడు నుంచి వచ్చి హైదరాబాద్​లోని ఆలివ్‌ ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్న తమను యాజమాన్యం వేధిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తమను నిర్భందించి కొవిడ్ డ్యూటీలు చేయిస్తున్నారని బాధిత నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు 101, 102 డిగ్రీల జ్వరం ఉన్నప్పటికీ... విధులకు తప్పనిసరిగా హాజరవ్వాలంటూ యాజమాన్యం ఒత్తిడి చేయడం పట్ల తాము మనోవేదనకు గురవుతున్నట్లు బాధితులు పేర్కొన్నారు. విధులకు హాజరు కాకుంటే యాజమాన్యం సమకూర్చిన వసతి గృహాన్ని వెంటనే ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని భయాందోళన వ్యక్తం చేశారు.

మీరే ఆదుకోవాలి...

తమను ఆదుకోవాలని తెలంగాణ నర్సింగ్ సమితికి బాధితులు లేఖ రాశారు. ఇప్పటికే ఎంతో మంది నర్సులకు కరోనా వైరస్ సోకిందని.. వ్యాధి లక్షణాలున్నప్పటికీ విధులకు రావాలంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారని వాపోయారు. తెలంగాణ ప్రభుత్వం మీద తమకు నమ్మకముందని... తమను రక్షించాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి : మహిళ మృతి.. భయంతో యువకుడి బలవన్మరణం

Last Updated : Jul 19, 2020, 7:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.