సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ చురుగ్గా ఉండే మంత్రి కేటీఆర్... నెటిజన్లతో ట్విట్టర్ వేదికగా ముచ్చటించారు. నెటిజన్లు అడిగిన పలు ముఖ్యమైన, ఆసక్తికరమైన ప్రశ్నలకు మంత్రి స్పందిస్తూ... సమాధానాలిచ్చారు.
ప్రశ్న: ఏపీలో 3 రాజధానులపై మీ అభిప్రాయమేంటి...? తెలంగాణ వాసిగా కాదు... ఒక భారతీయునిగా సమాధానం చెప్పండి...?
సమాధానం: 3 రాజధానుల అంశాన్ని ఏపీ ప్రజలు నిర్ణయించాలి.. నేను కాదు.
ప్రశ్న: 2019లో మీకు ఎక్కువగా గుర్తుండిపోయే అంశం ఏంటి?
సమాధానం: అన్ని జిల్లా పరిషత్ పీఠాలను తెరాస గెలుచుకోవడమే 2019లో గుర్తుండిపోయే అంశం.
ప్రశ్న: ఆంధ్రప్రదేశ్లో మీ పార్టీని విస్తరించండి. అక్కడ రెండు పార్టీలు వ్యక్తిగత కక్ష్యలు పెట్టుకున్నాయి. మీరు వస్తే బాగుంటుంది.
సమాధానం: కృతజ్ఞతలు మిత్రమా... ఉద్యమ సమయంలో తెలంగాణకు సరైన నాయకత్వమే లేదన్నారు. ఇప్పుడు తెరాసను పొరుగు రాష్ట్రాలకు విస్తరించమని అంటున్నారు. ఏపీ ప్రజల నుంచి ఇలాంటి స్వాగతం లభించటమనేది సీఎం కేసీఆర్ గొప్ప నాయకత్వానికి నిదర్శనం.
ఇవీ చూడండి: అనిశా వలలో ఈసారే ఎక్కువ అవినీతి తిమింగలాలు...!