డిగ్రీ సెమిస్టర్ ఫీజులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ... ఎన్ఎస్యూఐ విద్యార్థులు ప్రగతి భవన్ను ముట్టడించారు. గేట్ లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టు చేశారు.
కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని.... ఒక్కో సెమిస్టర్కి రూ.1,600 రుసుము ఎలా కట్టాలని ప్రశ్నించారు. ఇప్పటికే ఈ విషయాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.
ఇదీ చదవండి: ముఖం చూడకుండానే పుట్టిన ప్రేమ.. ప్రాణాలనే బలిగొంది