ETV Bharat / state

ఒకే ఒక్కడు.. సంకల్పం పెద్దది

మీరు రోడ్డుపై వెళ్తున్నపుడు.. భిక్షాటన చేస్తున్న పిల్లాడు కనిపిస్తే ఏం చేస్తారు. అయ్యో... పాపం అంటూ ఓ రూపాయో... పది రూపాయలో ఇస్తారు. అంతేకదా..! ఓ వ్యక్తి మాత్రం లక్షల్లో వచ్చే జీతాన్ని వదులుకుని అలాంటి వారి కోసం ఓ స్వచ్చంద సంస్థను స్థాపించాడు. పిల్లల్ని భిక్షాటనకు దూరంగా ఉంచాలని సంకల్పించాడు. అతను ఎవరో.. ఎం సాధించాడో తెలుసుకుందామా...!

author img

By

Published : May 24, 2019, 9:48 AM IST

Updated : May 24, 2019, 4:58 PM IST

ఒకే ఒక్కడు.. సంకల్పం పెద్దది

భిక్షాటన చేసే పిల్లల్ని తరుచుగా రోడ్లపై చూస్తుంటాం. అయ్యో పాపం అనుకుంటాం తప్ప.. ఎందుకలా అయ్యారన్న కారణం మాత్రం ఆలోచించం. దిల్లీకి చెందిన ఆశిష్​ అందరిలా ఆలోచించలేదు. బాలల భిక్షాటన లేని భారత దేశాన్ని చూడాలనుకున్నాడు. వినూత్న నిర్ణయంతో సమస్య పరిష్కారానికి బాటలు వేశాడు.

ఒకే ఒక్కడు.. సంకల్పం పెద్దది

ఆ సంఘటనతో ఓ సంకల్పానికి దారి:

ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్న సమయంలో భిక్షాటన చేస్తూ చేతి నుంచి రక్తమోడుతున్న పిల్లాడ్ని చూశాడో రోజు. వైద్యం చేయించి, ఓ స్వచ్ఛంద సంస్థ సహాయంతో పాఠశాలలో చేర్పించాడు. ఆ బాలుడి భవిష్యత్​కో భరోసా దొరికినా...దేశంలో ఇంకెంతమంది ఇలా దుర్భర జీవనాన్ని సాగిస్తున్నారో అనే ఆలోచన వెంటాడింది.

ఉన్ముక్త్‌ ఇండియా:

2015లో ఉద్యోగానికి రాజీనామా చేసి..బాలల విద్యా ప్రాముఖ్యత తెలియజేసేందుకు "ఉన్ముక్త్ ఇండియా" పేరుతో 17 వేల కిలోమీటర్ల పాదయాత్రకు సంకల్పించాడు. దువాయే పేరుతో స్వచ్ఛంద సంస్థనూ స్థాపించాడు.

22 ఆగస్టు 2017న జమ్ముకశ్మీర్ నుంచి పాదయాత్ర మొదలుపెట్టాడు. ఇప్పటికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా 217 నగరాల్లో పర్యటించాడు.

ఒక జిల్లాకు చేరుకోగానే..కలెక్టర్, ఎస్పీ, వివిధ పాఠశాలల యాజమాన్యాలతో సమావేశమవుతాడు. బాలల విద్యా ప్రాముఖ్యత గురించి వివరించి..పిల్లల్ని భిక్షాటనకు దూరంగా ఉంచాలని విజ్ఞప్తి చేస్తాడు.

డబ్బిలిచ్చే బదులు విద్యనివ్వాలి:

పేదరికం ఒక్కటే కారణం కాదని.. బాలల భిక్షాటన వెనక మాఫియా ఉందనే అనుమానం వ్యక్తం చేస్తున్నాడు ఆశిష్​. .యాచించేవారికి డబ్బులిచ్చే బదులు చదివించే ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.

2019 మార్చికి ఆశిష్​ పాదయాత్ర పూర్తవుతుంది. దేశంలోని విద్యా సంస్థలన్నింటిని అనుసంధానిచేందుకు దువాయే పేరుతో మొబైల్ అప్లికేషన్​ ​ ప్రారంభించాడు. 14 జూన్ 2019న నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ యాప్ విడుదల కానుంది.

ఇదీ చూడండి: గుర్రాలతోనే జీవితస్వారీ...

భిక్షాటన చేసే పిల్లల్ని తరుచుగా రోడ్లపై చూస్తుంటాం. అయ్యో పాపం అనుకుంటాం తప్ప.. ఎందుకలా అయ్యారన్న కారణం మాత్రం ఆలోచించం. దిల్లీకి చెందిన ఆశిష్​ అందరిలా ఆలోచించలేదు. బాలల భిక్షాటన లేని భారత దేశాన్ని చూడాలనుకున్నాడు. వినూత్న నిర్ణయంతో సమస్య పరిష్కారానికి బాటలు వేశాడు.

ఒకే ఒక్కడు.. సంకల్పం పెద్దది

ఆ సంఘటనతో ఓ సంకల్పానికి దారి:

ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్న సమయంలో భిక్షాటన చేస్తూ చేతి నుంచి రక్తమోడుతున్న పిల్లాడ్ని చూశాడో రోజు. వైద్యం చేయించి, ఓ స్వచ్ఛంద సంస్థ సహాయంతో పాఠశాలలో చేర్పించాడు. ఆ బాలుడి భవిష్యత్​కో భరోసా దొరికినా...దేశంలో ఇంకెంతమంది ఇలా దుర్భర జీవనాన్ని సాగిస్తున్నారో అనే ఆలోచన వెంటాడింది.

ఉన్ముక్త్‌ ఇండియా:

2015లో ఉద్యోగానికి రాజీనామా చేసి..బాలల విద్యా ప్రాముఖ్యత తెలియజేసేందుకు "ఉన్ముక్త్ ఇండియా" పేరుతో 17 వేల కిలోమీటర్ల పాదయాత్రకు సంకల్పించాడు. దువాయే పేరుతో స్వచ్ఛంద సంస్థనూ స్థాపించాడు.

22 ఆగస్టు 2017న జమ్ముకశ్మీర్ నుంచి పాదయాత్ర మొదలుపెట్టాడు. ఇప్పటికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా 217 నగరాల్లో పర్యటించాడు.

ఒక జిల్లాకు చేరుకోగానే..కలెక్టర్, ఎస్పీ, వివిధ పాఠశాలల యాజమాన్యాలతో సమావేశమవుతాడు. బాలల విద్యా ప్రాముఖ్యత గురించి వివరించి..పిల్లల్ని భిక్షాటనకు దూరంగా ఉంచాలని విజ్ఞప్తి చేస్తాడు.

డబ్బిలిచ్చే బదులు విద్యనివ్వాలి:

పేదరికం ఒక్కటే కారణం కాదని.. బాలల భిక్షాటన వెనక మాఫియా ఉందనే అనుమానం వ్యక్తం చేస్తున్నాడు ఆశిష్​. .యాచించేవారికి డబ్బులిచ్చే బదులు చదివించే ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.

2019 మార్చికి ఆశిష్​ పాదయాత్ర పూర్తవుతుంది. దేశంలోని విద్యా సంస్థలన్నింటిని అనుసంధానిచేందుకు దువాయే పేరుతో మొబైల్ అప్లికేషన్​ ​ ప్రారంభించాడు. 14 జూన్ 2019న నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ యాప్ విడుదల కానుంది.

ఇదీ చూడండి: గుర్రాలతోనే జీవితస్వారీ...

Tg_Nzb_07_23_bjp_win_overall_pkg_r21 Reporter: Srishylam.K, Camera: Manoj (ఫీడ్ ట్రీజీ నుంచి వచ్చింది. వాడుకోగలరు) (. ) ఇందూరులో కాషాయ జెండా రెపరెపలాడింది. నిజామాబాద్ లోక్ సభ స్థానాన్ని భాజపా కైవసం చేసుకుంది. మంచి ఆధిక్యంలో ధర్మపురి అర్వింద్ విజయం సాధించారు. ఆద్యంతం అందరిలోనూ ఉత్కంఠ రేపిన ఇందూరు ఫలితం భాజపా వైపు మొగ్గింది. 185 మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో నిజామాబాద్ లోక్ సభ పోలింగ్ దేశం దృష్టిని ఆకర్షించింది........ LOOOOK Vo: నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో భాజపా ఘన విజయం సాధించింది. తెరాస సిట్టింగ్ స్థానాన్ని భాజపా కైవసం చేసుకుంది. సీఎం కేసీఆర్ కూతురు, సిట్టింగ్ ఎంపీ కవిత పరాజయం పాలయ్యారు. మొదటి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు భాజపా ఆద్యంతం ఆధిక్యత కనబర్చింది. ఏ రౌండ్ లోనూ తెరాస భాజపాను దాటలేకపోయింది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు లోనూ తెరాస వెనుకంజ వేసింది. ప్రతి రౌండ్ లోనూ 17 వేలకు పైగా మెజార్టీ సాధిస్తూ భాజపా దూసుకుపోయింది. పార్లమెంట్ లో బోధన్, నిజామాబాద్ అర్బన్ మినహా బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, జగిత్యాల, కొరుట్ల నియోజకవర్గాల్లో భాజపా ఆధిక్యం సాధించింది...... spot VO: నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లిలో నిజామాబాద్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాలు, జగిత్యాల వీఆర్కే కళాశాలలో జగిత్యాల, కొరుట్ల నియోజకవర్గాల కౌంటింగ్ నిర్వహించారు. మొత్తం 15,53,014 మంది ఓటర్లు ఉండగా.. 10,61,124 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. లోక్ సభ పరిధిలో 68.33 శాతం పోలింగ్ నమోదైంది. మొదటి రౌండ్ లో 18180, రెండో రౌండ్ లో 15,677, మూడో రౌండ్ లో 18,664, నాలుగో రౌండ్ లో 16,146, ఐదో రౌండ్ లో 1518 భాజపా ఆధిక్యత కనబర్చింది. ఒక్క ఆరో రౌండ్ లో మాత్రం 8129 ఓట్ల ఆధిక్యత తెరాస సాధించింది. ఏడో రౌండ్ లో మళ్లీ భాజపా 3293 ఓట్ల ఆధిక్యతను భాజపా సాధించింది. ఎనిమిదో రౌండ్ లో 3,910 ఓట్ల ఆధిక్యాన్ని భాజపా అభ్యర్థి అర్వింద్ సాధించారు...spot VO: 185 మంది అభ్యర్థులు ఉండటంతో 36 టేబుళ్లు ఏర్పాటు చేసి లెక్కింపు చేపట్టారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు హాళ్ల చొప్పున ఏర్పాటు చేశారు. అయితే టేబుళ్లు రెట్టింపు చేయడంతో రౌండ్లు సగానికి తగ్గిపోయాయి. జగిత్యాల, కోరుట్ల, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ లో 8 రౌండ్లు, బాల్కొండ, బోధన్ లో 7 రౌండ్లు, ఆర్మూర్ లో 6 రౌండ్లు ఉన్నాయి. దీంతో లెక్కింపు సమయం సగం తగ్గి మిగతా నియోజకవర్గాలతో సమానంగా ఫలితం వెల్లడిస్తామని అధికారులు చెప్పినా... వెల్లడిలో మాత్రం తీవ్ర ఆలస్యమైంది. మొదటి రౌండ్ వివరాలు అధికారికంగా వెల్లడించేందుకు ఒంటి గంట వరకు సమయం తీసుకున్నారు. చివరి రౌండ్ ఫలితం రాత్రి తొమ్మిదిన్నర కు ఇచ్చారు. బోధన్ 5, బాల్కొండ 5, నిజామాబాద్ అర్బన్, రూరల్ లో ఒకటి చొప్పున కంట్రోల్ యూనిట్ లు మొరాయించడంతో వివిపాట్ స్లిప్పులు లెక్కించారు. లెక్కింపు ముందే పూర్తయినా అభ్యర్థుల వారీగా వివరాలు నమోదు చేసుకుని వాటిని లెక్కించి ఎన్నికల సంఘం వెబ్ సైట్ లో వివరాలు నమోదు చేసిన తరువాత రౌండ్ ల వారీగా వివరాలు వెల్లడించారు.....vis VO: నిజామాబాద్ లోక్ సభ స్థానంలో మద్దతు ధర కోసం బరిలో నిలిచిన రైతులు... దాదాపు లక్ష ఓట్లు సాధించారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన మధుయాష్కీ గౌడ్ కు 65వేల ఓట్ల వరకు వచ్చాయి. భాజపా అభ్యర్థి 4,80,584, తెరాస అభ్యర్థి కి 4,09,709, కాంగ్రెస్ అభ్యర్ధి మధుయాష్కీ గౌడ్ కు 69,240 ఓట్లు వచ్చాయి. 70,875 ఓట్లతో భాజపా అభ్యర్థి అర్వింద్ విజయం సాధించారు....spot VO: కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్ డిపాజిట్ కోల్పోయారు. కాగా దాదాపు లక్ష ఓట్లు సాధించిన రైతు అభ్యర్థులు... తెరాస అభ్యర్థి ఓటమికి కారణమయ్యారు. ఇది ఏమైనా స్వయానా సీఎం కూతురు, సిట్టింగ్ ఎంపీగా ఉన్న కవిత ఓటమి పాలవడం ఆ పార్టీకి మింగుడు పడని అంశం అయితే... భాజపా విజయం ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది...spot Evo: ఏది ఏమైనా స్వయానా సీఎం కూతురు, సిట్టింగ్ ఎంపీగా ఉన్న కవిత ఓటమి పాలవడం ఆ పార్టీకి మింగుడు పడని అంశం అయితే... భాజపా విజయం ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది...END
Last Updated : May 24, 2019, 4:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.