ETV Bharat / state

నూతన ఇసుక విధానం.. కేంద్ర సంస్థలకు ఏపీ గనులశాఖ లేఖ

author img

By

Published : Nov 9, 2020, 8:30 AM IST

ఏపీలో ఇసుక తవ్వకాలు, నిల్వ కేంద్రాలకు తరలింపు, అమ్మకాల ప్రక్రియ చేపట్టేందుకు ముందుకు రావాలని కోరుతూ... 8 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఏపీ గనుల శాఖ లేఖలు రాసింది. ఇందులో ఏవైనా స్పందించాయో లేదో తెలియాల్సి ఉంది. ఎవరూ స్పందించకుంటే ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రక్రియ చేపట్టనుంది.

new-sand-policy-state-mining-letter-to-central-agencies
నూతన ఇసుక విధానం.. కేంద్ర సంస్థలకు రాష్ట్ర గనులశాఖ లేఖ

ఆంధ్రప్రదేశ్​లో నూతన ఇసుక విధానంలో భాగంగా రీచుల్లో ఇసుక తవ్వకాలు, నిల్వ కేంద్రాలకు తరలింపు, అమ్మకాల ప్రక్రియ చేపట్టేందుకు ముందుకు రావాలని కోరుతూ 8 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఏపీ గనుల శాఖ లేఖలు రాసింది. మైనింగ్‌లో అనుభవమున్న ఎన్​ఎండీసీ, ఎంఎంటీసీ తదితర సంస్థలకు లేఖలు రాయగా వాటిలో ఏవైనా స్పందించాయో లేదో తెలియాల్సి ఉంది.

డిసెంబరు 15 లోగా

ఏదైనా సంస్థ ముందుకొస్తే నేరుగా ఇసుక బాధ్యతలను అధికారులు అప్పగించనున్నారు. ఎవరూ స్పందించకపోతే ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రక్రియ చేపట్టనున్నారు. 13 జిల్లాలను 3 మండలాలుగా విభజించి టెండర్లు పిలిచి గుత్తేదారు సంస్థలకు అప్పగించే ప్రక్రియ డిసెంబర్‌ 15లోగా పూర్తిచేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కొత్త విధానంలో ఇసుక లభించే రేవులను పెంచి మొత్తంగా 500 రేవులను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పుడు పట్టా భూముల్లో తవ్వకాలు పూర్తిగా ఆపేస్తూ కేవలం నదులు, ఇసుక మేటలు ఉన్న చోట తవ్వనున్నారు. అన్ని జిల్లాల్లో వీటి గుర్తింపు దాదాపుగా పూర్తైంది. జిల్లా స్థాయి ఇసుక కమిటీ.. డీఎల్​ఎస్​సీలో అనుమతి తీసుకుని గనులశాఖ నుంచి లీజుల కేటాయింపు, తర్వాత పర్యావరణ అనుమతులు తీసుకునే ప్రక్రియ చేస్తోంది.

ఇదీ చదవండి: రాష్ట్రంపై పంజా విసురుతున్న చలిపులి

ఆంధ్రప్రదేశ్​లో నూతన ఇసుక విధానంలో భాగంగా రీచుల్లో ఇసుక తవ్వకాలు, నిల్వ కేంద్రాలకు తరలింపు, అమ్మకాల ప్రక్రియ చేపట్టేందుకు ముందుకు రావాలని కోరుతూ 8 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఏపీ గనుల శాఖ లేఖలు రాసింది. మైనింగ్‌లో అనుభవమున్న ఎన్​ఎండీసీ, ఎంఎంటీసీ తదితర సంస్థలకు లేఖలు రాయగా వాటిలో ఏవైనా స్పందించాయో లేదో తెలియాల్సి ఉంది.

డిసెంబరు 15 లోగా

ఏదైనా సంస్థ ముందుకొస్తే నేరుగా ఇసుక బాధ్యతలను అధికారులు అప్పగించనున్నారు. ఎవరూ స్పందించకపోతే ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రక్రియ చేపట్టనున్నారు. 13 జిల్లాలను 3 మండలాలుగా విభజించి టెండర్లు పిలిచి గుత్తేదారు సంస్థలకు అప్పగించే ప్రక్రియ డిసెంబర్‌ 15లోగా పూర్తిచేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కొత్త విధానంలో ఇసుక లభించే రేవులను పెంచి మొత్తంగా 500 రేవులను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పుడు పట్టా భూముల్లో తవ్వకాలు పూర్తిగా ఆపేస్తూ కేవలం నదులు, ఇసుక మేటలు ఉన్న చోట తవ్వనున్నారు. అన్ని జిల్లాల్లో వీటి గుర్తింపు దాదాపుగా పూర్తైంది. జిల్లా స్థాయి ఇసుక కమిటీ.. డీఎల్​ఎస్​సీలో అనుమతి తీసుకుని గనులశాఖ నుంచి లీజుల కేటాయింపు, తర్వాత పర్యావరణ అనుమతులు తీసుకునే ప్రక్రియ చేస్తోంది.

ఇదీ చదవండి: రాష్ట్రంపై పంజా విసురుతున్న చలిపులి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.