తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం ముక్కోలు గ్రామ యువకులు.. తమ గ్రామంలోకి కరోనా వైరస్ వ్యాపించకుండా వినూత్న ప్రయోగం చేశారు. పసుపు, వేప రసం, బ్లీచింగ్ పౌడర్ను సమపాళ్లలో కలిపి ప్రత్యేక ద్రావణం తయారు చేశారు. యంత్రాల సాయంతో దీనిని గ్రామంలో పిచికారి చేశారు.
దీని ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చునని యువత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. యువత చేసిన ప్రయత్నాన్ని గ్రామస్థులు అభినందించారు.
ఇదీ చదవండి: కరోనా నివారణకు తునిలో హోమం