రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోశ్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో ప్రముఖ సినీనటి, మహరాష్ట్ర అమరావతి లోక్ సభ సభ్యురాలు నవనీత్ కౌర్ మొక్కలు నాటారు.
![మా తోటి పార్లమెంట్ సభ్యులు జోగినిపల్లి సంతోష్ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో నేను కూడా భాగస్వాములు కావాలని ఉద్దేశంతో మొక్కలు నాటాను అని చెప్పారు. (Twitter/Photo)](https://images.news18.com/telugu/uploads/2020/10/Navneet-Kaur-Green-India-Challenge-News18-3.jpg)
ఎంపీ సంతోష్ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో తను కూడా భాగస్వాములు కావాలని ఉద్దేశంతో తన నివాసంలో మొక్కలు నాటినట్లు నవనీత్ కౌర్ వెల్లడించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రజలలో చైతన్యం తీసుకు వస్తుందని ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన సంతోశ్కు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వారి బృంద సభ్యులకు మద్దతుగా ఉంటామన్నారు.
![ఈ సందర్భంగా నవనీత్ కౌర్ మాట్లాడుతూ కొన్ని నెలలుగా నేను చూస్తున్నాను. తమ చిత్ర పరిశ్రమకు చెందిన అదేవిధంగా వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు గ్రీన్ ఇండియా ఛాలెంజలో భాగంగా మొక్కలు నాటడం జరుగుతోందని అన్నారు. (Twitter/Photo)](https://images.news18.com/telugu/uploads/2020/10/Navneet-Kaur-Green-India-Challenge-News18-1.jpg)
గ్రీన్ ఇండియా ఛాలెంజ్కు ప్రతి ఒక్కరు మద్దతు తెలిపి బాధ్యతగా మొక్కలు నాటాలని... భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించాలంటే ఇలాంటి కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలని సూచించారు.