ETV Bharat / state

ఔషధం మాటున మాదకద్రవ్యం... హైదరాబాద్​ కేంద్రంగా వ్యాపారం

author img

By

Published : Sep 27, 2020, 5:14 AM IST

Updated : Sep 27, 2020, 7:05 AM IST

తక్కువ శ్రమతో ఎక్కువ లాభం ఉండడం, స్వల్ప పెట్టుబడితో భారీగా లాభాలు ఉండడం వల్ల హైదరాబాద్‌ కేంద్రంగా మత్తు ముఠాలు చెలరేగిపోతున్నాయి. బల్క్​డ్రగ్‌ తయారీ పరిశ్రమలు అధికంగా ఉండడం వల్ల నిపుణులు, ముడిసరుకు లభ్యత పుష్కలంగా ఉండడం, మూతపడిన పరిశ్రమలు నిఘాకు దూరంగా ఉంటున్న శివారు ప్రాంతాలు కావడం అక్రమార్కులకు అన్ని రకాలుగా కలిసొస్తున్నాయి. మందుల మాటున మూడు పూవులు ఆరుకాయలుగా దందా నడిపిస్తూ.. మత్తు పదార్థాల తయారు చేస్తూ.. దేశ విదేశాలకు సరఫరా చేస్తున్న వైనంపై ప్రత్యేక కథనం.

narcotics-manufacturing-in-the-name-of-medicine-in-hyderabad
ఔషధం మాటున మాదకద్రవ్యం... హైదరాబాద్​ కేంద్రంగా వ్యాపారం

హైదరాబాద్‌ భాగ్యనగరం బల్క్‌ డ్రగ్‌ తయారీ పరిశ్రమలకు పెట్టింది పేరు. వెయ్యికిపైగా మందుల తయారీ పరిశ్రమలున్న ప్రపంచ వ్యాప్తంగా పేరున్న బాగ్యనగరం.. మత్తుమందుల ముఠాల కారణగా అపఖ్యాతి పాలవుతోంది. మందుల తయారీకి సమృద్ధిగా ఉన్న వనరులను ఆసరా చేసుకుని భారీ మొత్తంలో మత్తు మందుల తయారీకి అక్రమార్కులు తెర తీస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు బయట దేశాలకు ఇక్కడ నుంచే వివిధ రకాల మత్తుమందులు ఎగుమతి చేస్తున్నారు.

రెండు చేతులా సంపాదిస్తున్నారు అక్రమార్కులు. మూతపడిన, నష్టాల ఊబిలో చిక్కుకున్న పరిశ్రమలే మత్తుమందుల ముఠాల అక్రమాలకు అడ్డాలు అవుతున్నాయి. నగర శివారు ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా దందా సాగిస్తున్నాయి. ఇటీవలే జిన్నారం ప్రాంతంలో ఓ కంపెనీలో డీఆర్‌ఐ అధికారులు చేసిన సోదాల్లో ఏకంగా వంద కోట్లకుపైగా విలువైన మాదక ద్రవ్యాల పట్టుబడ్డాయి.ఈ దందాలో బొబ్బా వెంకట్​రెడ్డి పట్టుబడ్డాడు. ఈ నేపథ్యంలో "ఈనాడు-ఈటీవీ'' బృందం మత్తు ముఠాల ఆగడాలపై క్షేత్ర స్థాయిలో పరిశీలించగా అనేక విస్మయకర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

60-70 పరిశ్రమల్లో..

భాగ్యనగర శివార్లలో జీడిమెట్ల, పాశమైలారం, పటాన్‌చెరు, గడ్డపోతారం, ఖాజీపల్లి, ఐడీఏ బొల్లారం, బొంతపల్లి, మేడ్చల్‌, చర్లపల్లితోపాటు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌, వెలిమినేడు, వలిగొండ, ధర్మోజిగూడెం తదితర ప్రాంతాల్లో వెయ్యికిపైగా ఫార్మా కంపెనీలు ఉన్నాయి. వాటిలో ప్రపంచ వ్యాప్తంగా పేరున్న బల్క్‌ డ్రగ్‌ కంపెనీలు ఉన్నాయి.

కాని కొన్ని చిన్న కంపెనీలు ఉత్పత్తి చేసే మందులకు డిమాండ్‌ లేకపోవడం... మార్కెటింగ్‌ చేసుకోలేకపోవడం... తదితర కారణాల వల్ల పెట్టుబడులకు తగినట్లు రాబడులు రాక నష్టాల ఊబిలోకి నెట్టబడి మూత పడుతున్నాయి. ఇవే అక్రమార్కులకు అడ్డాలుగా మారుతున్నాయి. నగర శివారు ప్రాంతాల్లో ఇలాంటివి 60 నుంచి 70 వరకు ఉంటాయని అంచనా. మత్తు ముఠాలు నిషేధిత మాదకద్రవ్యాల తయారీకి ఇలా మూతపడ్డ వాటినే ఉపయోగిస్తున్నట్లు పలుమార్లు నిఘా సంస్థల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. కొందరైతే... ఇళ్లలోనే ల్యాబ్‌లను ఏర్పాటు చేసుకుని మత్తుమందుల తయారీ దందాను సాగిస్తున్నారు. జీడిమెట్ల సుభాష్‌నగర్‌, మల్కాజిగిరి ప్రాంతాల్లో ఇలాంటి ల్యాబ్‌ల బాగోతం గతంలో బహిర్గతమైంది.

హైదరాబాగ్​ అడ్డా ఎందుకంటే..

గంజాయి అనగానే మనకు గుర్తొచ్చేది ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాలైన అటవీ ప్రాంతం. అక్కడ అటవీ ప్రాంతంలో వందల ఎకరాలల్లో గంజాయి సాగుచేసి హైదరాబాద్‌తోపాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు విదేశాలకు కూడా ఎగుమతి చేస్తుండడం సర్వసాధారణం. ఇతర మత్తు మందులను దేశంతోకి గుట్టుగా దిగుమతి చేసుకోవడం జరిగేది. కాని గత కొంతకాలంగా హైదరాబాద్‌లోనే మాదకద్రవ్యాలు తయారై విదేశాలకు ఎగుమతి అవుతుండడం విస్తుగొలుపుతోంది.

గడిచిన రెండు, మూడు సంవత్సరాలుగా ఎక్సైజ్‌, పోలీసు శాఖలతోపాటు డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటిలిజెన్స్‌-డీఆర్‌ఐ సోదాల్లో భారీ ఎత్తున మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. హైదరాబాద్‌ నగరంలో బల్క్‌ డ్రగ్‌ పరిశ్రమలు ఎక్కువగా ఉండడం వల్ల మందుల తయారీకి అవసరమైన ముడి సరుకులు, రసాయనాలు బహిరంగంగానే లభిస్తుంటాయి. ఫార్మాపై గట్టి పట్టున్న నిపుణులు కూడా అందుబాటులో ఉంటారు. వివిధ కారణాలతో మూతపడిన కంపెనీలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉండడం వల్ల మాదకద్రవ్యాల తయారీ ముఠాలకు ఇవన్నీ కలిసొస్తున్నాయి.

జాబ్​వర్క్​ పేరిట లీజుకు తీసుకుని..

పెద్ద, పెద్ద అంతర్జాతీయ పేరు ప్రఖ్యాతలున్న కంపెనీలకు జాబ్‌ వర్క్‌ చేసేవిగా చిన్న చిన్న కంపెనీలు ఏర్పాటవుతున్నాయి. వాస్తవానికి పెద్ద కంపెనీలకు వచ్చే భారీ ఆర్డర్లను సకాలంలో పూర్తి చేయడానికి ఇలా ఏర్పాటైన చిన్న కంపెనీలకు కొన్ని పనులను అప్పగించి చేయించుకోవడాన్ని జాబ్‌ వర్క్‌ అని ముద్దుగా పిలుస్తారు. జాబ్‌ వర్క్​ల పేరుతో అక్రమార్కులు కొందరు మూతపడిన పరిశ్రమల యజమానుల్ని సంప్రదించి జాబ్‌ వర్క్‌ చేసుకునేందుకు లీజుకు కావాలని అడుగుతున్నాయి.

ఖాళీగా ఉండేబదులు ఎంతో కొంత డబ్బు వస్తుందన్న ఆశతో యజమానులు లీజుకు ఇచ్చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో యజమానులకు తెలిసినా కూడా మత్తు ముఠాలకు లీజుకు ఇస్తున్నారు. తమకు అనువైన టెక్నీషియన్లను నియమించుకుని మందుల ముసుగులో ఎపిడ్రిన్‌, మెపిడ్రోన్‌, కెటమైన్‌, ఎండీఎంఎ తదితర మాదకద్రవ్యాల్ని తయారు చేస్తున్నాయి. అదే విధంగా మలేషియా, సింగపూర్‌, జపాన్‌, చైనా, ఇండోనేషియాలల్లో పార్టీ డ్రగ్‌గా పిలిచే ఆంపిటమైన్‌ లాంటివి తయారీ చేయడానికి ఎపిడ్రిన్‌ కీలక ముడిసరుకు కావడం వల్ల ఎక్కువగా దీని వైపే మక్కువ చూపుతున్నారు. వారం, పది రోజుల్లోనే వీటిని తయారు చేసే అవకాశం ఉండటం వల్ల ఒక విడత తయారీ పూర్తవగానే అక్కడ నుంచి మకాం మార్చేస్తున్నారు.

5-8 దశలు.. చివరి దశల్లోనే గుర్తింపు..

మందులైనా...మత్తు మందులైనా 5 నుంచి 8 దశలు పూర్తైతే కాని అవి అసలు స్వరూపంలోకి రావు. ఇలాంటప్పుడు అవి ఏవి అనేది ముందే తేల్చడం కష్టం. ఏయే రసాయనాలు ఎంత మోతాదులో కలిపితే ఎలాంటి మందులు తయారవుతాయనే విషయంపై నిపుణులకు మాత్రమే పట్టు ఉంటుంది. తగిన మోతాదులో ముడి సరుకుల్ని రియాక్టర్ల్‌లో కలుపుతున్న ముఠాలు చివరి దశలో మాదకద్రవ్యాలుగా మార్చేందుకు అవసరమైన రసాయనాలను కలుపుతున్నట్లు పలు మార్లు మత్తు ముఠాలు పట్టుబడిన సందర్బాల్లో జరిగిన విచారణలో తేలింది. సాధారణంగా అయితే మత్తు ముఠాల బాగోతాన్ని పసిగట్టడం సాధ్యం కాదు.

అసలు వ్యక్తులు దొరకరు..

ఇక్కడ తయారవుతున్న మత్తు పదార్ధాల్ని హైదరాబాద్‌ నుంచి ముంబయి, చెన్నైలకు వెళ్లే ప్రైవేటు బస్సుల్లో సరుకు రవాణా పార్శిళ్లను తీసుకెళ్తారు. ఆ పార్శిళ్లపై సరియైన అడ్రస్సు ఉండదు. ఇక్కడ పార్శిల్‌ చేసిన తరువాత ఆ రషీదును వారికి వాట్సప్‌ ద్వారా పంపిస్తారు. దాని ఆధారంగా ఆ ప్రైవేటు ట్రావెల్స్‌ కార్యాలయానికి వెళ్లి పార్శిళ్లను తీసుకెళ్తారు. ఇంతలోపు బస్సును ఎవరైనా తనిఖీలు చేసి దానిని పట్టుకున్నా ఎలాంటి ఆధారాలు లభ్యం కావు.

ఇవి కాకుండా కొందరు అక్రమార్కులు ప్రైవేటు వాహనాల్లో కూడా తరలిస్తారు. అయితే రవాణాదారుడికి విషయం తెలియకుండానే గమ్యస్థానానికి చేరేలోపు సరుకు ముగ్గురు, నలుగురు చేతులు మారేట్లు జాగ్రత్తలు తీసుకుంటారు. అలా చేయడం వల్ల మార్గ మధ్యలో ఎక్కడైనా పట్టుబడ్డా అసలు వ్యక్తులు దొరకరు... దొరికినా వారికి అసలు వ్యక్తులు ఎవరో కూడా తెలియదు. ఇలా నిఘా సంస్థలకు దొరకకుండా ముంబయి, చెన్నై ఓడరేవులకు తరలించి అక్కడ నుంచి విదేశాలకు తరలిస్తున్నారు.

ఇక్కడ లక్ష.. విదేశాల్లో 10 లక్షలు

హైదరాబాద్‌లో తయారవుతన్న మత్తుపదార్థాలు ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానికంగా విక్రయాలు జరగవు. విదేశాలకు పంపించేందుకే మత్తు ముఠాలు మొగ్గు చూపుతున్నాయి. నిఘా వ్యవస్థలకు చిక్కకుండా ఉండటంతో విదేశీ మార్కెట్‌లో ఆశించిన దానికంటే అధిక మొత్తం లబ్ది చేకూరుతోంది. ఎపిడ్రిన్‌ కిలో లక్ష రూపాయలు ఇక్కడ ఉంటే విదేశాల్లో అయితే ఏకంగా 10లక్షలకుపైగా ఉంటుంది.

అందుకే మత్తు ముఠాలు మాదకద్రవ్యాల్ని శ్రీలంక, మయన్మార్‌, సింగపూర్‌, మలేషియా, థాయ్‌లాండ్‌ లాంటి దేశాలకు సరుకు పేరుతో ఎగుమతి చేస్తున్నాయి. మరికొంత సరుకును స్థానికంగా ఎక్కువగా డిమాండ్‌ ఉన్న దిల్లీ, ముంబయిలకు తరలిస్తున్నారు. హవాలా మార్గంలో డబ్బులొస్తున్నాయి. రాత్రికి రాత్రే డబ్బు సంపాదించాలన్న ఆశతో కొందరు ఈ దందాలోకి దిగుతుండగా మరికొందరు పరిస్థితుల ప్రభావంతో వక్రమార్గం పడుతున్నారు. వాస్తవానికి మాదకద్రవ్యాల దందాలో పట్టుబడితే ఎన్‌డీపీఎస్‌ -1985 చట్టం సెక్షన్లు 25ఎ, 9ఎల కింద నమోదయ్యే కేసుల్లో నేరం రుజువైతే పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది.

ఎప్పుడు నిందితులు పట్టుబడినా సూత్రధారులు మాత్రం దొరకరు. స్వాధీనం చేసుకున్న మత్తుమందుల తయారీకి తెరవెనుక ఎవరున్నారన్న లోతుపాతుల్లోకి కూడా నిఘా సంస్థలు వెల్లడం లేదు.

ఇవీ చూడండి: అక్రమంగా తరలిస్తున్న 19 లక్షల విలువైన గుట్కా పట్టివేత

హైదరాబాద్‌ భాగ్యనగరం బల్క్‌ డ్రగ్‌ తయారీ పరిశ్రమలకు పెట్టింది పేరు. వెయ్యికిపైగా మందుల తయారీ పరిశ్రమలున్న ప్రపంచ వ్యాప్తంగా పేరున్న బాగ్యనగరం.. మత్తుమందుల ముఠాల కారణగా అపఖ్యాతి పాలవుతోంది. మందుల తయారీకి సమృద్ధిగా ఉన్న వనరులను ఆసరా చేసుకుని భారీ మొత్తంలో మత్తు మందుల తయారీకి అక్రమార్కులు తెర తీస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు బయట దేశాలకు ఇక్కడ నుంచే వివిధ రకాల మత్తుమందులు ఎగుమతి చేస్తున్నారు.

రెండు చేతులా సంపాదిస్తున్నారు అక్రమార్కులు. మూతపడిన, నష్టాల ఊబిలో చిక్కుకున్న పరిశ్రమలే మత్తుమందుల ముఠాల అక్రమాలకు అడ్డాలు అవుతున్నాయి. నగర శివారు ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా దందా సాగిస్తున్నాయి. ఇటీవలే జిన్నారం ప్రాంతంలో ఓ కంపెనీలో డీఆర్‌ఐ అధికారులు చేసిన సోదాల్లో ఏకంగా వంద కోట్లకుపైగా విలువైన మాదక ద్రవ్యాల పట్టుబడ్డాయి.ఈ దందాలో బొబ్బా వెంకట్​రెడ్డి పట్టుబడ్డాడు. ఈ నేపథ్యంలో "ఈనాడు-ఈటీవీ'' బృందం మత్తు ముఠాల ఆగడాలపై క్షేత్ర స్థాయిలో పరిశీలించగా అనేక విస్మయకర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

60-70 పరిశ్రమల్లో..

భాగ్యనగర శివార్లలో జీడిమెట్ల, పాశమైలారం, పటాన్‌చెరు, గడ్డపోతారం, ఖాజీపల్లి, ఐడీఏ బొల్లారం, బొంతపల్లి, మేడ్చల్‌, చర్లపల్లితోపాటు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌, వెలిమినేడు, వలిగొండ, ధర్మోజిగూడెం తదితర ప్రాంతాల్లో వెయ్యికిపైగా ఫార్మా కంపెనీలు ఉన్నాయి. వాటిలో ప్రపంచ వ్యాప్తంగా పేరున్న బల్క్‌ డ్రగ్‌ కంపెనీలు ఉన్నాయి.

కాని కొన్ని చిన్న కంపెనీలు ఉత్పత్తి చేసే మందులకు డిమాండ్‌ లేకపోవడం... మార్కెటింగ్‌ చేసుకోలేకపోవడం... తదితర కారణాల వల్ల పెట్టుబడులకు తగినట్లు రాబడులు రాక నష్టాల ఊబిలోకి నెట్టబడి మూత పడుతున్నాయి. ఇవే అక్రమార్కులకు అడ్డాలుగా మారుతున్నాయి. నగర శివారు ప్రాంతాల్లో ఇలాంటివి 60 నుంచి 70 వరకు ఉంటాయని అంచనా. మత్తు ముఠాలు నిషేధిత మాదకద్రవ్యాల తయారీకి ఇలా మూతపడ్డ వాటినే ఉపయోగిస్తున్నట్లు పలుమార్లు నిఘా సంస్థల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. కొందరైతే... ఇళ్లలోనే ల్యాబ్‌లను ఏర్పాటు చేసుకుని మత్తుమందుల తయారీ దందాను సాగిస్తున్నారు. జీడిమెట్ల సుభాష్‌నగర్‌, మల్కాజిగిరి ప్రాంతాల్లో ఇలాంటి ల్యాబ్‌ల బాగోతం గతంలో బహిర్గతమైంది.

హైదరాబాగ్​ అడ్డా ఎందుకంటే..

గంజాయి అనగానే మనకు గుర్తొచ్చేది ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాలైన అటవీ ప్రాంతం. అక్కడ అటవీ ప్రాంతంలో వందల ఎకరాలల్లో గంజాయి సాగుచేసి హైదరాబాద్‌తోపాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు విదేశాలకు కూడా ఎగుమతి చేస్తుండడం సర్వసాధారణం. ఇతర మత్తు మందులను దేశంతోకి గుట్టుగా దిగుమతి చేసుకోవడం జరిగేది. కాని గత కొంతకాలంగా హైదరాబాద్‌లోనే మాదకద్రవ్యాలు తయారై విదేశాలకు ఎగుమతి అవుతుండడం విస్తుగొలుపుతోంది.

గడిచిన రెండు, మూడు సంవత్సరాలుగా ఎక్సైజ్‌, పోలీసు శాఖలతోపాటు డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటిలిజెన్స్‌-డీఆర్‌ఐ సోదాల్లో భారీ ఎత్తున మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. హైదరాబాద్‌ నగరంలో బల్క్‌ డ్రగ్‌ పరిశ్రమలు ఎక్కువగా ఉండడం వల్ల మందుల తయారీకి అవసరమైన ముడి సరుకులు, రసాయనాలు బహిరంగంగానే లభిస్తుంటాయి. ఫార్మాపై గట్టి పట్టున్న నిపుణులు కూడా అందుబాటులో ఉంటారు. వివిధ కారణాలతో మూతపడిన కంపెనీలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉండడం వల్ల మాదకద్రవ్యాల తయారీ ముఠాలకు ఇవన్నీ కలిసొస్తున్నాయి.

జాబ్​వర్క్​ పేరిట లీజుకు తీసుకుని..

పెద్ద, పెద్ద అంతర్జాతీయ పేరు ప్రఖ్యాతలున్న కంపెనీలకు జాబ్‌ వర్క్‌ చేసేవిగా చిన్న చిన్న కంపెనీలు ఏర్పాటవుతున్నాయి. వాస్తవానికి పెద్ద కంపెనీలకు వచ్చే భారీ ఆర్డర్లను సకాలంలో పూర్తి చేయడానికి ఇలా ఏర్పాటైన చిన్న కంపెనీలకు కొన్ని పనులను అప్పగించి చేయించుకోవడాన్ని జాబ్‌ వర్క్‌ అని ముద్దుగా పిలుస్తారు. జాబ్‌ వర్క్​ల పేరుతో అక్రమార్కులు కొందరు మూతపడిన పరిశ్రమల యజమానుల్ని సంప్రదించి జాబ్‌ వర్క్‌ చేసుకునేందుకు లీజుకు కావాలని అడుగుతున్నాయి.

ఖాళీగా ఉండేబదులు ఎంతో కొంత డబ్బు వస్తుందన్న ఆశతో యజమానులు లీజుకు ఇచ్చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో యజమానులకు తెలిసినా కూడా మత్తు ముఠాలకు లీజుకు ఇస్తున్నారు. తమకు అనువైన టెక్నీషియన్లను నియమించుకుని మందుల ముసుగులో ఎపిడ్రిన్‌, మెపిడ్రోన్‌, కెటమైన్‌, ఎండీఎంఎ తదితర మాదకద్రవ్యాల్ని తయారు చేస్తున్నాయి. అదే విధంగా మలేషియా, సింగపూర్‌, జపాన్‌, చైనా, ఇండోనేషియాలల్లో పార్టీ డ్రగ్‌గా పిలిచే ఆంపిటమైన్‌ లాంటివి తయారీ చేయడానికి ఎపిడ్రిన్‌ కీలక ముడిసరుకు కావడం వల్ల ఎక్కువగా దీని వైపే మక్కువ చూపుతున్నారు. వారం, పది రోజుల్లోనే వీటిని తయారు చేసే అవకాశం ఉండటం వల్ల ఒక విడత తయారీ పూర్తవగానే అక్కడ నుంచి మకాం మార్చేస్తున్నారు.

5-8 దశలు.. చివరి దశల్లోనే గుర్తింపు..

మందులైనా...మత్తు మందులైనా 5 నుంచి 8 దశలు పూర్తైతే కాని అవి అసలు స్వరూపంలోకి రావు. ఇలాంటప్పుడు అవి ఏవి అనేది ముందే తేల్చడం కష్టం. ఏయే రసాయనాలు ఎంత మోతాదులో కలిపితే ఎలాంటి మందులు తయారవుతాయనే విషయంపై నిపుణులకు మాత్రమే పట్టు ఉంటుంది. తగిన మోతాదులో ముడి సరుకుల్ని రియాక్టర్ల్‌లో కలుపుతున్న ముఠాలు చివరి దశలో మాదకద్రవ్యాలుగా మార్చేందుకు అవసరమైన రసాయనాలను కలుపుతున్నట్లు పలు మార్లు మత్తు ముఠాలు పట్టుబడిన సందర్బాల్లో జరిగిన విచారణలో తేలింది. సాధారణంగా అయితే మత్తు ముఠాల బాగోతాన్ని పసిగట్టడం సాధ్యం కాదు.

అసలు వ్యక్తులు దొరకరు..

ఇక్కడ తయారవుతున్న మత్తు పదార్ధాల్ని హైదరాబాద్‌ నుంచి ముంబయి, చెన్నైలకు వెళ్లే ప్రైవేటు బస్సుల్లో సరుకు రవాణా పార్శిళ్లను తీసుకెళ్తారు. ఆ పార్శిళ్లపై సరియైన అడ్రస్సు ఉండదు. ఇక్కడ పార్శిల్‌ చేసిన తరువాత ఆ రషీదును వారికి వాట్సప్‌ ద్వారా పంపిస్తారు. దాని ఆధారంగా ఆ ప్రైవేటు ట్రావెల్స్‌ కార్యాలయానికి వెళ్లి పార్శిళ్లను తీసుకెళ్తారు. ఇంతలోపు బస్సును ఎవరైనా తనిఖీలు చేసి దానిని పట్టుకున్నా ఎలాంటి ఆధారాలు లభ్యం కావు.

ఇవి కాకుండా కొందరు అక్రమార్కులు ప్రైవేటు వాహనాల్లో కూడా తరలిస్తారు. అయితే రవాణాదారుడికి విషయం తెలియకుండానే గమ్యస్థానానికి చేరేలోపు సరుకు ముగ్గురు, నలుగురు చేతులు మారేట్లు జాగ్రత్తలు తీసుకుంటారు. అలా చేయడం వల్ల మార్గ మధ్యలో ఎక్కడైనా పట్టుబడ్డా అసలు వ్యక్తులు దొరకరు... దొరికినా వారికి అసలు వ్యక్తులు ఎవరో కూడా తెలియదు. ఇలా నిఘా సంస్థలకు దొరకకుండా ముంబయి, చెన్నై ఓడరేవులకు తరలించి అక్కడ నుంచి విదేశాలకు తరలిస్తున్నారు.

ఇక్కడ లక్ష.. విదేశాల్లో 10 లక్షలు

హైదరాబాద్‌లో తయారవుతన్న మత్తుపదార్థాలు ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానికంగా విక్రయాలు జరగవు. విదేశాలకు పంపించేందుకే మత్తు ముఠాలు మొగ్గు చూపుతున్నాయి. నిఘా వ్యవస్థలకు చిక్కకుండా ఉండటంతో విదేశీ మార్కెట్‌లో ఆశించిన దానికంటే అధిక మొత్తం లబ్ది చేకూరుతోంది. ఎపిడ్రిన్‌ కిలో లక్ష రూపాయలు ఇక్కడ ఉంటే విదేశాల్లో అయితే ఏకంగా 10లక్షలకుపైగా ఉంటుంది.

అందుకే మత్తు ముఠాలు మాదకద్రవ్యాల్ని శ్రీలంక, మయన్మార్‌, సింగపూర్‌, మలేషియా, థాయ్‌లాండ్‌ లాంటి దేశాలకు సరుకు పేరుతో ఎగుమతి చేస్తున్నాయి. మరికొంత సరుకును స్థానికంగా ఎక్కువగా డిమాండ్‌ ఉన్న దిల్లీ, ముంబయిలకు తరలిస్తున్నారు. హవాలా మార్గంలో డబ్బులొస్తున్నాయి. రాత్రికి రాత్రే డబ్బు సంపాదించాలన్న ఆశతో కొందరు ఈ దందాలోకి దిగుతుండగా మరికొందరు పరిస్థితుల ప్రభావంతో వక్రమార్గం పడుతున్నారు. వాస్తవానికి మాదకద్రవ్యాల దందాలో పట్టుబడితే ఎన్‌డీపీఎస్‌ -1985 చట్టం సెక్షన్లు 25ఎ, 9ఎల కింద నమోదయ్యే కేసుల్లో నేరం రుజువైతే పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది.

ఎప్పుడు నిందితులు పట్టుబడినా సూత్రధారులు మాత్రం దొరకరు. స్వాధీనం చేసుకున్న మత్తుమందుల తయారీకి తెరవెనుక ఎవరున్నారన్న లోతుపాతుల్లోకి కూడా నిఘా సంస్థలు వెల్లడం లేదు.

ఇవీ చూడండి: అక్రమంగా తరలిస్తున్న 19 లక్షల విలువైన గుట్కా పట్టివేత

Last Updated : Sep 27, 2020, 7:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.