ETV Bharat / state

అతను వేసే బొమ్మలకు కుంచె అవసరంలేదు... గోళ్లు చాలు

author img

By

Published : Oct 5, 2020, 3:26 PM IST

కళకు అనేక రూపాలున్నాయి. డ్రాయింగ్, పెయింటింగ్, సాండ్ ఆర్ట్ ఇలా భిన్నరూపాల్లో ఉండే కళలు అందరికీ సుపరిచితమే. కానీ.. నెయిల్ ఆర్ట్ గురించి విన్నారా. అంటే గోళ్లతో గీసే కళారూపాలు. పదునైన నఖములతో.. సున్నితమైన పేపర్​పై ఆర్ట్ వేయడం ఎప్పుడైనా చూశారా? హైదరాబాద్​కు చెందిన నరసింహాచారి గోళ్లతో బొమ్మలు వేస్తూ... ఔరా అనిపిస్తున్నారు.

nakha-chitra-artist-in-amberpet-at-hyderabad
అతను వేసే బొమ్మలకు కుంచె అవసరంలేదు... గోళ్లు చాలు

కొందరు గోళ్లను అందం కోసం పెంచుకుంటుంటే... హైదరాబాద్​లోని అంబర్​పేటకు చెందిన నరసింహాచారి మాత్రం ఆర్ట్ వేయటానికి పెంచుకుంటున్నారు. తన పదునైన గోళ్లతో... చేతిలోనే ఇమిడిపోయే పేపర్​పై నిముషాల వ్యవధిలోనే అబ్బురపరిచే బొమ్మలు గీస్తూ.. ఔరా అనిపిస్తున్నారు. కాదేది కళకు అనర్హమని నిరూపిస్తున్నారు.

అతను వేసే బొమ్మలకు కుంచె అవసరంలేదు... గోళ్లు చాలు

తన ఉపాధ్యాయుడు నుంచి ఈ ఆర్ట్ నేర్చుకున్నట్లు నరసింహ తెలిపారు. సరదాగా ప్రారంభమైన ఈ వ్యాపకం... ప్రముఖులు, దేవతామూర్తుల బొమ్మలు వేసేలా పరిణితి చెందినట్లు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల బొమ్మలు వేసి... వారికి కానుకగా ఇచ్చినట్లు పేర్కొన్నారు.

భిన్నరూపాల్లో...

ఆర్ట్ టీచర్​గా రాణించాలని ఫైన్​ఆర్ట్స్​లో కోర్సును సైతం పూర్తి చేశానని తెలిపారు. కానీ కుటుంబపోషణ దృష్ట్యా కార్పెంటర్​గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో సినిమాలకు ఆర్ట్​ డైరెక్టర్​గా పనిచేశానని నరసింహ పేర్కొన్నారు. తనలో ఆర్ట్​ ప్రతిబింబించేలా కిటికీలు, ఎంట్రెన్స్ గేట్లలో భిన్నరూపాలు సృష్టిస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

పాఠశాల విద్యార్థులు, స్నేహితులు, బంధువులు, చుట్టుపక్కల వారు తనతో నెయిల్ ఆర్ట్ వేయించుకుంటారని.. వారి శుభకార్యాలు, ప్రత్యేక రోజుల్లో గిఫ్ట్​గా ఇచ్చుకుంటారని నరసింహ సంతోషం వ్యక్తం చేశారు. తన నఖ చిత్రాలన్నింటినీ కలిపి ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్​లో ప్రదర్శించడమే తన అని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఆ 11 కుటుంబాల కోసం 11 గంటలు నడిచి వెళ్లిన సీఎం..

కొందరు గోళ్లను అందం కోసం పెంచుకుంటుంటే... హైదరాబాద్​లోని అంబర్​పేటకు చెందిన నరసింహాచారి మాత్రం ఆర్ట్ వేయటానికి పెంచుకుంటున్నారు. తన పదునైన గోళ్లతో... చేతిలోనే ఇమిడిపోయే పేపర్​పై నిముషాల వ్యవధిలోనే అబ్బురపరిచే బొమ్మలు గీస్తూ.. ఔరా అనిపిస్తున్నారు. కాదేది కళకు అనర్హమని నిరూపిస్తున్నారు.

అతను వేసే బొమ్మలకు కుంచె అవసరంలేదు... గోళ్లు చాలు

తన ఉపాధ్యాయుడు నుంచి ఈ ఆర్ట్ నేర్చుకున్నట్లు నరసింహ తెలిపారు. సరదాగా ప్రారంభమైన ఈ వ్యాపకం... ప్రముఖులు, దేవతామూర్తుల బొమ్మలు వేసేలా పరిణితి చెందినట్లు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల బొమ్మలు వేసి... వారికి కానుకగా ఇచ్చినట్లు పేర్కొన్నారు.

భిన్నరూపాల్లో...

ఆర్ట్ టీచర్​గా రాణించాలని ఫైన్​ఆర్ట్స్​లో కోర్సును సైతం పూర్తి చేశానని తెలిపారు. కానీ కుటుంబపోషణ దృష్ట్యా కార్పెంటర్​గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో సినిమాలకు ఆర్ట్​ డైరెక్టర్​గా పనిచేశానని నరసింహ పేర్కొన్నారు. తనలో ఆర్ట్​ ప్రతిబింబించేలా కిటికీలు, ఎంట్రెన్స్ గేట్లలో భిన్నరూపాలు సృష్టిస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

పాఠశాల విద్యార్థులు, స్నేహితులు, బంధువులు, చుట్టుపక్కల వారు తనతో నెయిల్ ఆర్ట్ వేయించుకుంటారని.. వారి శుభకార్యాలు, ప్రత్యేక రోజుల్లో గిఫ్ట్​గా ఇచ్చుకుంటారని నరసింహ సంతోషం వ్యక్తం చేశారు. తన నఖ చిత్రాలన్నింటినీ కలిపి ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్​లో ప్రదర్శించడమే తన అని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఆ 11 కుటుంబాల కోసం 11 గంటలు నడిచి వెళ్లిన సీఎం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.