ETV Bharat / state

Mynampally Clarifies on Constituency Change Rumours : 'మల్కాజిగిరి నుంచే పోటీ.. కార్యకర్తల కోసం ప్రాణత్యాగానికి సిద్ధమే'

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 23, 2023, 4:38 PM IST

Mynampally Clarifies on Constituency Change Rumours : వేరే నియోజకవర్గం నుంచి మైనంపల్లి పోటీ చేస్తారంటూ వస్తున్న వదంతులపై ఆయన స్పందించారు. తనపై కావాలనే కొందరు సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. మల్కాజిగిరి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని మైనంపల్లి హన్మంతరావు స్పష్టం చేశారు.

Mynampally Hanmantha Rao resigned from BRS
Mynampally Hanmantha Rao

Mynampally Clarifies on Constituency Change Rumours in Hyderabad : మల్కాజిగిరి నియోజకవర్గం నుంచే తాను పోటీ చేస్తానని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు (Mynampally Hanmantha Rao) స్పష్టం చేశారు. కొందరు కావాలనే సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుత్బుల్లాపూర్‌, మేడ్చల్‌ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నానంటూ వదంతులు పుట్టిస్తున్నారని పేర్కొన్నారు. పలువురు కార్యకర్తలు ఇవాళ భారీగా తరలిరావడంతో మైనంపల్లి నివాసం వద్ద సందడి నెలకొంది.

Mynampally Hanmantha Rao Meet with Activists : వారం రోజుల తర్వాత.. రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా: మైనంపల్లి హన్మంతరావు

ఈ క్రమంలోనే కాంగ్రెస్ నాయకుడు నర్సారెడ్డి భూపతిరెడ్డి.. మైనంపల్లిని హన్మంతరావును.. హస్తం పార్టీలోకి ఆహ్వానించారు. తమకు పదవులు ముఖ్యం కాదని.. కార్యకర్తలే ముఖ్యమని మైనంపల్లి స్పష్టం చేశారు. అవసరమైతే వారి కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని వెల్లడించారు. తమ కోసం బయటకు వచ్చిన కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

"మల్కాజిగిరి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తాను. కొందరు సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని పుకార్లు పుట్టిస్తున్నారు. పదవులు ముఖ్యం కాదు.. కార్యకర్తలే ముఖ్యం." మైనంపల్లి హన్మంతరావు, ఎమ్మెల్యే

Mynampally Clarifies on Constituency Change Rumours మల్కాజిగిరి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేసిన మైనంపల్లి

MLA Mynampally Hanmantha Rao Resigned BRS : మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు శుక్రవారం బీఆర్ఎస్​ పార్టీకి (Mynampally Hanmantha Rao Resigned BRS ) రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ మల్కాజిగిరి అభ్యర్థిగా మైనంపల్లిని.. ఇటీవల భారత్ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అయితే తనకు మల్కాజిగిరి, కుమారుడికి మెదక్ టికెట్​ను ఆయన ఆశించారు. కుమారుడు రోహిత్​కు మెదక్ టికెట్ ఇవ్వలేదనే అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు మంత్రి హరీశ్​రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం పట్ల బీఆర్ఎస్ అధిష్ఠానం కూడా మైనంపల్లి హన్మంతరావుపై ఆగ్రహంతో ఉంది.

మైనంపల్లి హన్మంతరావు వ్యాఖ్యలను కేటీఆర్, కవితతో పాటు పలువురు నాయకులు బహిరంగంగానే ఖండించారు. ఈ నేపథ్యంలో మల్కాజిగిరి అభ్యర్థిని మారుస్తారని ఓ వైపు.. మైనంపల్లి కాంగ్రెస్​లో చేరతారని మరోవైపు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత్ రాష్ట్ర సమితిని​ వీడుతున్నట్లు మైనంపల్లి హన్మంతరావు అధికారికంగా ప్రకటించారు.

ఇటీవలే మైనంపల్లి హన్మంతరావు తిరుమలలో బీఆర్​ఎస్​ కీలక నేత, మంత్రి హరీశ్​రావుపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. మెదక్​ నియోజకవర్గంలో హరీశ్​రావు పెత్తనమేంటని ఆయన ప్రశ్నించారు. మెదక్‌లో మంత్రి నియంతగా వ్యవహరిస్తున్నారని.. ఆయన తన గతం గుర్తుంచుకోవాలని అన్నారు. అక్కడి నుంచి తిరిగివచ్చిన అనంతరం మైనంపల్లి.. మల్కాజిగిరి, మెదక్‌ నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. తాను ఏ రాజకీయ పార్టీని దూషించనని.. ప్రాణం పోయే వరకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని ఆయన వివరించారు.

మెదక్ జిల్లాలో రామాయంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచానని.. తనకు మెదక్ ప్రజలు రాజకీయ భిక్ష పెట్టారని మైనంపల్లి హన్మంతరావు గుర్తు చేశారు. ఆ తర్వాత తెలంగాణ కోసం టీడీపీకి రాజీనామా చేసి.. టీఆర్​ఎస్​లో చేరానని అన్నారు. ఉద్యమంలో ప్రజలంతా కలిస్తే తెలంగాణ సాకారమైందని.. ప్రాణం పోయే వరకు మాటపైన ఉంటానని స్పష్టం చేశారు. ఎవరైనా తన జోలికి వస్తే ఉపేక్షించనని మైనంపల్లి హన్మంతరావు హెచ్చరించారు.

MLA Mynampally Latest Comments : 'నన్ను ఇబ్బంది పెడితే.. రియాక్షన్ ఇలాగే ఉంటుంది'

BRS Unsatisfied Leaders : టికెట్ల కేటాయింపుపై బీఆర్​ఎస్​లో ఆగని అసంతృప్తి.. అభ్యర్థిని మార్చాలని పలుచోట్ల డిమాండ్లు

Mynampally Clarifies on Constituency Change Rumours in Hyderabad : మల్కాజిగిరి నియోజకవర్గం నుంచే తాను పోటీ చేస్తానని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు (Mynampally Hanmantha Rao) స్పష్టం చేశారు. కొందరు కావాలనే సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుత్బుల్లాపూర్‌, మేడ్చల్‌ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నానంటూ వదంతులు పుట్టిస్తున్నారని పేర్కొన్నారు. పలువురు కార్యకర్తలు ఇవాళ భారీగా తరలిరావడంతో మైనంపల్లి నివాసం వద్ద సందడి నెలకొంది.

Mynampally Hanmantha Rao Meet with Activists : వారం రోజుల తర్వాత.. రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా: మైనంపల్లి హన్మంతరావు

ఈ క్రమంలోనే కాంగ్రెస్ నాయకుడు నర్సారెడ్డి భూపతిరెడ్డి.. మైనంపల్లిని హన్మంతరావును.. హస్తం పార్టీలోకి ఆహ్వానించారు. తమకు పదవులు ముఖ్యం కాదని.. కార్యకర్తలే ముఖ్యమని మైనంపల్లి స్పష్టం చేశారు. అవసరమైతే వారి కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని వెల్లడించారు. తమ కోసం బయటకు వచ్చిన కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

"మల్కాజిగిరి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తాను. కొందరు సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని పుకార్లు పుట్టిస్తున్నారు. పదవులు ముఖ్యం కాదు.. కార్యకర్తలే ముఖ్యం." మైనంపల్లి హన్మంతరావు, ఎమ్మెల్యే

Mynampally Clarifies on Constituency Change Rumours మల్కాజిగిరి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేసిన మైనంపల్లి

MLA Mynampally Hanmantha Rao Resigned BRS : మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు శుక్రవారం బీఆర్ఎస్​ పార్టీకి (Mynampally Hanmantha Rao Resigned BRS ) రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ మల్కాజిగిరి అభ్యర్థిగా మైనంపల్లిని.. ఇటీవల భారత్ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అయితే తనకు మల్కాజిగిరి, కుమారుడికి మెదక్ టికెట్​ను ఆయన ఆశించారు. కుమారుడు రోహిత్​కు మెదక్ టికెట్ ఇవ్వలేదనే అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు మంత్రి హరీశ్​రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం పట్ల బీఆర్ఎస్ అధిష్ఠానం కూడా మైనంపల్లి హన్మంతరావుపై ఆగ్రహంతో ఉంది.

మైనంపల్లి హన్మంతరావు వ్యాఖ్యలను కేటీఆర్, కవితతో పాటు పలువురు నాయకులు బహిరంగంగానే ఖండించారు. ఈ నేపథ్యంలో మల్కాజిగిరి అభ్యర్థిని మారుస్తారని ఓ వైపు.. మైనంపల్లి కాంగ్రెస్​లో చేరతారని మరోవైపు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత్ రాష్ట్ర సమితిని​ వీడుతున్నట్లు మైనంపల్లి హన్మంతరావు అధికారికంగా ప్రకటించారు.

ఇటీవలే మైనంపల్లి హన్మంతరావు తిరుమలలో బీఆర్​ఎస్​ కీలక నేత, మంత్రి హరీశ్​రావుపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. మెదక్​ నియోజకవర్గంలో హరీశ్​రావు పెత్తనమేంటని ఆయన ప్రశ్నించారు. మెదక్‌లో మంత్రి నియంతగా వ్యవహరిస్తున్నారని.. ఆయన తన గతం గుర్తుంచుకోవాలని అన్నారు. అక్కడి నుంచి తిరిగివచ్చిన అనంతరం మైనంపల్లి.. మల్కాజిగిరి, మెదక్‌ నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. తాను ఏ రాజకీయ పార్టీని దూషించనని.. ప్రాణం పోయే వరకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని ఆయన వివరించారు.

మెదక్ జిల్లాలో రామాయంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచానని.. తనకు మెదక్ ప్రజలు రాజకీయ భిక్ష పెట్టారని మైనంపల్లి హన్మంతరావు గుర్తు చేశారు. ఆ తర్వాత తెలంగాణ కోసం టీడీపీకి రాజీనామా చేసి.. టీఆర్​ఎస్​లో చేరానని అన్నారు. ఉద్యమంలో ప్రజలంతా కలిస్తే తెలంగాణ సాకారమైందని.. ప్రాణం పోయే వరకు మాటపైన ఉంటానని స్పష్టం చేశారు. ఎవరైనా తన జోలికి వస్తే ఉపేక్షించనని మైనంపల్లి హన్మంతరావు హెచ్చరించారు.

MLA Mynampally Latest Comments : 'నన్ను ఇబ్బంది పెడితే.. రియాక్షన్ ఇలాగే ఉంటుంది'

BRS Unsatisfied Leaders : టికెట్ల కేటాయింపుపై బీఆర్​ఎస్​లో ఆగని అసంతృప్తి.. అభ్యర్థిని మార్చాలని పలుచోట్ల డిమాండ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.