కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై కార్మికులు, కర్షకులు, చిన్నవ్యాపారులు పోరాడే సమయం ఆసన్నమైందని జాతీయ రైతు సంఘం నాయకుడు రాకేశ్సింగ్ టికాయత్ అన్నారు. ఏపీలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పరిరక్షణ సమితి చేపట్టనున్న బహిరంగ సభకు సంఘీభావం తెలిపేందుకు సంఘం నేతలు విశాఖ చేరుకున్నారు. స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
ఓ పక్క కనీస మద్దతు ధర కోసం రైతులు పోరాడుతుండగా.. భారీ పరిశ్రమల్ని ప్రైవేటుపరం చేయాలనుకోవడం దారుణమన్నారు రాకేశ్సింగ్. అంతా కలిసి పోరాడి.. ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని కాపాడాలని ఆయన కోరారు.
ఇదీ చదవండి: ఆ రాష్ట్రాలకు వెళ్తే.. ఈ ఆంక్షలు పాటించాల్సిందే!