ETV Bharat / state

ఈనెల 17న వార్డుల పునర్విభజనకు తుది నోటిఫికేషన్

author img

By

Published : Dec 10, 2019, 7:43 PM IST

పురపాలక ఎన్నికల కోసం వార్డుల పునర్విభజన ప్రక్రియకు సంబంధించిన అభ్యంతరాలు, అభిప్రాయాలపై పురపాలక శాఖ కసరత్తు చేస్తోంది. హైకోర్టు ఆదేశాల మేరకు 121 మున్సిపాల్టీలు, పది కార్పొరేషన్లకు సంబంధించిన వార్డుల పునర్విభజన ముసాయిదాను పురపాలక శాఖ ఈ నెల మూడో తేదీ విడుదల చేసింది.

municipal elections ward division process in telangana
ఈనెల 17న వార్డుల పునర్విభజనకు తుది నోటిఫికేషన్

పురపాలక ఎన్నికల కోసం ఆ శాఖ రంగం సిద్ధం చేస్తోంది. వార్డుల పునర్విభజన ప్రక్రియకు సంబంధించిన అభ్యంతరాలు, అభిప్రాయాలపై కసరత్తు ప్రారంభించింది. వార్డుల పునర్విభజన ముసాయిదాను పురపాలక శాఖ ఈ నెల మూడో తేదీ విడుదల చేసింది. ముసాయిదాపై ఏడు రోజుల పాటు నిన్నటి వరకు ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి అభ్యంతరాలు, అభిప్రాయాలు, సూచనలు స్వీకరించారు.

మొత్తం పది కార్పొరేషన్లు, 121 మున్సిపాల్టీల్లో వార్డుల విభజనకు సంబంధించి 1,892 అభ్యంతరాలు, సూచనలు అందాయి. ఈ సంఖ్య కరీంనగర్​లో అత్యధికంగా ఉన్నట్లు సమాచారం. నల్గొండ, మిర్యాలగూడ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

అన్ని చోట్లా వచ్చిన అభ్యంతరాలు, సూచనలను పురపాలక శాఖ పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను 16వ తేదీ వరకు పూర్తి చేయాలి. ఈ నెల 17వ తేదీన వార్డుల పునర్విభజనకు సంబంధించిన తుదినోటిఫికేషన్ జారీ చేస్తారు. ఆ తర్వాత అందుకు అనుగుణంగా వార్డుల వారీ ఫొటో ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం చేపడుతుంది.

పురపాలక ఎన్నికల కోసం ఆ శాఖ రంగం సిద్ధం చేస్తోంది. వార్డుల పునర్విభజన ప్రక్రియకు సంబంధించిన అభ్యంతరాలు, అభిప్రాయాలపై కసరత్తు ప్రారంభించింది. వార్డుల పునర్విభజన ముసాయిదాను పురపాలక శాఖ ఈ నెల మూడో తేదీ విడుదల చేసింది. ముసాయిదాపై ఏడు రోజుల పాటు నిన్నటి వరకు ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి అభ్యంతరాలు, అభిప్రాయాలు, సూచనలు స్వీకరించారు.

మొత్తం పది కార్పొరేషన్లు, 121 మున్సిపాల్టీల్లో వార్డుల విభజనకు సంబంధించి 1,892 అభ్యంతరాలు, సూచనలు అందాయి. ఈ సంఖ్య కరీంనగర్​లో అత్యధికంగా ఉన్నట్లు సమాచారం. నల్గొండ, మిర్యాలగూడ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

అన్ని చోట్లా వచ్చిన అభ్యంతరాలు, సూచనలను పురపాలక శాఖ పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను 16వ తేదీ వరకు పూర్తి చేయాలి. ఈ నెల 17వ తేదీన వార్డుల పునర్విభజనకు సంబంధించిన తుదినోటిఫికేషన్ జారీ చేస్తారు. ఆ తర్వాత అందుకు అనుగుణంగా వార్డుల వారీ ఫొటో ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం చేపడుతుంది.

File : TG_Hyd_41_10_Muncipolls_Dry_3053262 From : Raghu Vardhan ( ) పురపాలక ఎన్నికల కోసం వార్డుల పునర్విభజన ప్రక్రియకు సంబంధించిన అభ్యంతరాలు, అభిప్రాయాలపై పురపాలక శాఖ కసరత్తు చేస్తోంది. హైకోర్టు ఆదేశాల మేరకు 121 మున్సిపాల్టీలు, పది కార్పోరేషన్లకు సంబంధించిన వార్డుల పునర్విభజన ముసాయిదాను పురపాలక శాఖ ఈ నెల మూడో తేదీ విడుదల చేసింది. ముసాయిదాపై ఏడు రోజుల పాటు నిన్నటి వరకు ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి అభ్యంతరాలు, అభిప్రాయాలు, సూచనలు స్వీకరించారు. మొత్తం పది కార్పోరేషన్లు, 121 మున్సిపాల్టీల్లో వార్డుల విభజనకు సంబంధించి 1892 అభ్యంతరాలు, సూచనలు అందాయి. ఈ సంఖ్య కరీంనగర్ లో అత్యధికంగా ఉన్నట్లు సమాచారం. నల్గొండ, మిర్యాలగూడ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అన్ని చోట్లా వచ్చిన అభ్యంతరాలు, సూచనలను పురపాలక శాఖ పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను 16వ తేదీ వరకు పూర్తి చేయాలి. ఈ నెల 17వ తేదీన వార్డుల పునర్వభజనకు సంబంధించిన తుదినోటిఫికేషన్ జారీ చేస్తారు. ఆ తర్వాత అందుకు అనుగుణంగా వార్డుల వారీ ఫోటో ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం చేపడుతుంది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.