హైదరాబాద్ జిల్లా తెలంగాణ ఎన్జీవో సంఘం అధ్యక్షుడిగా నాలుగోసారి ఎన్నికైన ముజీబ్ హుస్సేన్, కార్యదర్శిగా ఎన్నికైన ప్రభాకర్ను టీఎన్జీవో సంఘం సభ్యులు ఘనంగా సత్కరించారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఆ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గెలిచిన వారికి ధ్రువపత్రాలను టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు కారెం రవీందర్ రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో బాణాసంచా కాల్చుతూ, డప్పుల చప్పుళ్లతో గెలిచిన వారికి తోటి ఉద్యోగులు స్వాగతం పలికారు. టీఎన్జీవోస్ సంఘానికి హృదయం వంటిదైన హైదరాబాద్ జిల్లాకు ముజీబ్ హుస్సేన్ ఏకగ్రీవంగా ఎన్నికవడం అభినందనీయమని రవీందర్ రెడ్డి అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని కోరారు.
ఇదీ చూడండి: ఉద్యోగుల సమస్యలు దశలవారీగా పరిష్కరిస్తాం: సీఎం