హైదరాబాద్ నగర శివారు నార్సింగి పీఎస్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. తల్లీకొడుకు ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
వివరాలు ఇలా...
తల్లి భార్గవి(34)కి కుమారుడు విరణ్య చౌదరి(10), ఒక కూతురు కూడా ఉంది. అయితే.. కొద్దిరోజులుగా భార్గవి అనారోగ్యంతో బాధపడుతున్నందని పోలీసులు తెలిపారు. భర్త ఉద్యోగానికి వెళ్లినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుందని వివరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శవపరీక్షల నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి: మోదీ 2.0: నవ శకానికి నాంది.. దౌత్యపరంగా విజయం