ETV Bharat / state

ఏపీలో కొత్తగా 6,242 కరోనా కేసులు, 40 మరణాలు

author img

By

Published : Oct 4, 2020, 6:00 PM IST

Updated : Oct 4, 2020, 7:02 PM IST

ap corona news
ఏపీలో కొత్తగా 6,242 కరోనా కేసులు, 40 మరణాలు

17:56 October 04

ఏపీలో కొత్తగా 6,242 కరోనా కేసులు, 40 మరణాలు

ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 6,242 కరోనా పాజిటివ్​ కేసులు నమోద్యయాయి. మరో 40 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 7,19,256కు చేరింది. మరణాల సంఖ్య 5,981కు ఎగబాకింది.

ఆంధ్రప్రదేశ్​లో 6,58,875 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. 54,400 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 24 గంటల వ్యవధిలో 72,811 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 60,94,206 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు.

జిల్లాల వారీగా కరోనా కేసులు

చిత్తూరు జిల్లాలో 863, పశ్చిమగోదావరిలో 853, తూర్పుగోదావరిలో 826 మందికి కరోనా సోకింది. ప్రకాశంలో 582, గుంటూరులో 562, కృష్ణాలో 469, నెల్లూరులో 413, అనంతపురంలో 411, కడప జిల్లాలో 408, విశాఖలో 222, విజయనగరంలో 221, కర్నూలులో 220, శ్రీకాకుళంలో 192 కరోనా కేసులు బయటపడ్డాయి.

జిల్లాల వారీగా మృతులు

కరోనాతో కృష్ణా జిల్లాలో ఆరుగురు, అనంతపురం, చిత్తూరులో ఐదుగురు చొప్పున మృతి చెందారు. తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో నలుగురు చొప్పున, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ముగ్గురు చొప్పున, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో ఒక్కరు చొప్పున మరణించారు.

ఇవీచూడండి: తెలంగాణలో మరో 1,949 కరోనా కేసులు, 10 మరణాలు

17:56 October 04

ఏపీలో కొత్తగా 6,242 కరోనా కేసులు, 40 మరణాలు

ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 6,242 కరోనా పాజిటివ్​ కేసులు నమోద్యయాయి. మరో 40 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 7,19,256కు చేరింది. మరణాల సంఖ్య 5,981కు ఎగబాకింది.

ఆంధ్రప్రదేశ్​లో 6,58,875 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. 54,400 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 24 గంటల వ్యవధిలో 72,811 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 60,94,206 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు.

జిల్లాల వారీగా కరోనా కేసులు

చిత్తూరు జిల్లాలో 863, పశ్చిమగోదావరిలో 853, తూర్పుగోదావరిలో 826 మందికి కరోనా సోకింది. ప్రకాశంలో 582, గుంటూరులో 562, కృష్ణాలో 469, నెల్లూరులో 413, అనంతపురంలో 411, కడప జిల్లాలో 408, విశాఖలో 222, విజయనగరంలో 221, కర్నూలులో 220, శ్రీకాకుళంలో 192 కరోనా కేసులు బయటపడ్డాయి.

జిల్లాల వారీగా మృతులు

కరోనాతో కృష్ణా జిల్లాలో ఆరుగురు, అనంతపురం, చిత్తూరులో ఐదుగురు చొప్పున మృతి చెందారు. తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో నలుగురు చొప్పున, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ముగ్గురు చొప్పున, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో ఒక్కరు చొప్పున మరణించారు.

ఇవీచూడండి: తెలంగాణలో మరో 1,949 కరోనా కేసులు, 10 మరణాలు

Last Updated : Oct 4, 2020, 7:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.