ETV Bharat / state

పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

author img

By

Published : May 12, 2020, 3:43 PM IST

హైదరాబాద్​ దోమలగూడలో ఎంఏఆర్​ఐ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో బస్తీవాసులకు ముషీరాబాద్​ ఎమ్మెల్యే ముఠా గోపాల్​ నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. అనంతరం ముషీరాబాద్​లో జీహెచ్​ఎంసీ కార్మికులకు సరకులను అందజేశారు. పేదప్రజలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు.

mla muta gopal groceries distribution in hyderabad
పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

పేద ప్రజలను, కార్మికులను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని ముషీరాబాద్​ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పేర్కొన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని బస్తీ ప్రజలను, జీహెచ్ఎంసీ కార్మికులను ఆదుకోవడానికి పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. లాక్​డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ దోమలగూడలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆవరణలో ఎంఏఆర్​ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బస్తీవాసులకు నిత్యావసర సరకులను ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్పొరేటర్ లాస్య నందిత పంపిణీ చేశారు.

ముషీరాబాద్​లోని వాలీబాల్ మైదానంలో తెరాస నాయకుడు ఎడ్ల హరిబాబు యాదవ్ నేతృత్వంలో జీహెచ్ఎంసీ కార్మికులకు ఎమ్మెల్యే ముఠా గోపాల్ నిత్యావసర సరకులను అందజేశారు. సమాజంలోని అభాగ్యులను, పేదలను ఆదుకోవడం అందరి బాధ్యత అని ఎమ్మెల్యే చెప్పారు.

పేద ప్రజలను, కార్మికులను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని ముషీరాబాద్​ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పేర్కొన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని బస్తీ ప్రజలను, జీహెచ్ఎంసీ కార్మికులను ఆదుకోవడానికి పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. లాక్​డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ దోమలగూడలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆవరణలో ఎంఏఆర్​ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బస్తీవాసులకు నిత్యావసర సరకులను ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్పొరేటర్ లాస్య నందిత పంపిణీ చేశారు.

ముషీరాబాద్​లోని వాలీబాల్ మైదానంలో తెరాస నాయకుడు ఎడ్ల హరిబాబు యాదవ్ నేతృత్వంలో జీహెచ్ఎంసీ కార్మికులకు ఎమ్మెల్యే ముఠా గోపాల్ నిత్యావసర సరకులను అందజేశారు. సమాజంలోని అభాగ్యులను, పేదలను ఆదుకోవడం అందరి బాధ్యత అని ఎమ్మెల్యే చెప్పారు.

ఇవీ చూడండి: ప్రజల ముందుకు నిజాన్ని తీసుకొచ్చిన ఈనాడుకు అభినందనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.