ETV Bharat / state

'ధరణి ఓ అద్భుతమైన అవకాశం... అంతా వినియోగించుకోవాలి' - హైదరాబాద్ లేటెస్ట్ న్యూస్

రిజిస్ట్రేషన్ల ప్రక్రియను సులభతరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్​ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాశ్ రెడ్డి కోరారు. ఉప్పల్ తహసీల్దార్ కార్యాలయంలో ధరణి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆయన ప్రారంభించారు. సర్వే నంబర్, ఆధార్ నంబర్ తప్పుగా ఇవ్వకూడదని సూచించారు.

uppal mla
uppal mla
author img

By

Published : Nov 13, 2020, 9:57 AM IST

ధరణి ఓ అద్భుతమైన అవకాశమని... రైతులంతా వినియోగించుకోవాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాశ్ రెడ్డి కోరారు. రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, గిఫ్ట్​డీడ్ లాంటివి సులభంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్​ను అంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉప్పల్ తహసీల్దార్ కార్యాలయంలో ధరణి రిజిస్ట్రేషన్​ ప్రక్రియను ఆయన ప్రారంభించారు.

ఎవరైనా, ఎక్కడి నుంచైనా వారి భూములకు సంబంధించిన వివరాలను ధరణి ద్వారా తెలుసుకోవచ్చునని తెలిపారు. మీసేవ కేంద్రాలకు వెళ్లి ప్రాసెసింగ్ ఫీజు కోసం రూ.200 చెల్లించి... వెసులుబాటు ఉన్న రోజు స్లాట్ బుక్ చేసుకోవచ్చని ఆయన సూచించారు. సర్వే నంబర్, ఆధార్ వివరాలు తప్పుగా ఇవ్వకూడదని అన్నారు.

గతంలో రిజిస్ట్రేషన్ల కోసం తెలిసీ తెలియక చాలా డబ్బులు ఖర్చుపెట్టే దుస్థితి ఉండేదని... కానీ ఇప్పుడు ధరణిలో 15 నిమిషాల్లో ప్రాసెసింగ్ పూర్తయ్యి పాస్ బుక్ పొందే సౌకర్యం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు గౌతమ్ కుమార్, నియోజకవర్గం కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: తోడు కోసం వచ్చి... ఒంటరిగా కన్నుమూసి..

ధరణి ఓ అద్భుతమైన అవకాశమని... రైతులంతా వినియోగించుకోవాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాశ్ రెడ్డి కోరారు. రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, గిఫ్ట్​డీడ్ లాంటివి సులభంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్​ను అంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉప్పల్ తహసీల్దార్ కార్యాలయంలో ధరణి రిజిస్ట్రేషన్​ ప్రక్రియను ఆయన ప్రారంభించారు.

ఎవరైనా, ఎక్కడి నుంచైనా వారి భూములకు సంబంధించిన వివరాలను ధరణి ద్వారా తెలుసుకోవచ్చునని తెలిపారు. మీసేవ కేంద్రాలకు వెళ్లి ప్రాసెసింగ్ ఫీజు కోసం రూ.200 చెల్లించి... వెసులుబాటు ఉన్న రోజు స్లాట్ బుక్ చేసుకోవచ్చని ఆయన సూచించారు. సర్వే నంబర్, ఆధార్ వివరాలు తప్పుగా ఇవ్వకూడదని అన్నారు.

గతంలో రిజిస్ట్రేషన్ల కోసం తెలిసీ తెలియక చాలా డబ్బులు ఖర్చుపెట్టే దుస్థితి ఉండేదని... కానీ ఇప్పుడు ధరణిలో 15 నిమిషాల్లో ప్రాసెసింగ్ పూర్తయ్యి పాస్ బుక్ పొందే సౌకర్యం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు గౌతమ్ కుమార్, నియోజకవర్గం కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: తోడు కోసం వచ్చి... ఒంటరిగా కన్నుమూసి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.