కరోనా కారణంగా దేశంలో రక్త నిల్వలు తగ్గిపోతున్నందున యువత రక్త దానం చేయాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. కూకట్ పల్లి వివేకానంద నగర్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ... రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
కేవలం ప్రారంభించడమే కాకుండా రక్తదానం చేసి నాయకులు, కార్యకర్తలు కూడా రక్త దానం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది తెరాస నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు.
ఇవీ చూడండి: హైదరాబాద్లో ఒక్క రోజులోనే 20 కేసులు