ETV Bharat / state

'అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి'

సీఎం కేసీఆర్‌ మార్గనిర్దేశంలో కోట్లాది రూపాయలు వెచ్చించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సనత్ నగర్ నియోజకవర్గంలో పర్యటించిన తలసాని పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు.

author img

By

Published : Jun 27, 2021, 3:04 PM IST

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిప‌థంలో దూసుకుపోతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అమీర్ పేట డివిజన్‌లోని లీలానగర్‌లో రూ. 38 లక్షల వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను మంత్రి ప్రారంభించారు. కాలనీ ప్రజల అవసరాల కోసం నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను చిన్న చిన్న పంక్షన్‌లు, కాలనీ అభివృద్ధి కోసం సమావేశాల నిర్వహణ వంటి కార్యక్రమాల కోసం వినియోగించుకోవాలని పేర్కొన్నారు.

నియోజకవర్గ పరిధిలోని సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చిన వెంటనే... వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని తలసాని తెలిపారు. అనంతరం సనత్‌నగర్‌లోని నెహ్రు పార్కులో రూ. 1.50 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్ ప్లే గ్రౌండ్, ప్లే కోర్టు తదితర అభివృద్ధి పనులను ప్రారంభించారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యన్ని సహించే ప్రసక్తే లేదని అధికారులను హెచ్చరించారు.

బల్కంపేట మెయిన్ రోడ్‌లో రూ. 22 లక్షల వ్యయంతో నిర్నించనున్న స్ట్రీట్ వెండర్ జోన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. సనత్‌నగర్ ఇండస్ట్రీయల్ పార్కు సమీపంలో సైతం రూ. 26 లక్షలతో చేపట్టనున్న స్ట్రీట్ వెండర్ జోన్ నిర్మాణ పనులను ప్రారంభించారు. రోడ్లపై వివిధ వ్యాపారాలు నిర్వహించుకుంటున్న చిరు వ్యాపారుల కోసం వీటిని నిర్మిస్తున్నట్లు తెలిపారు.

చిరు వ్యాపారులు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తూ వాటిని సద్వినియోగం చేసుకోవాలని తలసాని కోరారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ ప్రావీణ్య, డీసీ వంశీ, ఈఈ ఇందిర, స్థానిక కార్పొరేటర్‌లు కొలన్ లక్ష్మీ బాల్ రెడ్డి, సరళ, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: CM KCR : 'ఎస్సీ, ఎస్టీల సాధికారతలో పైరవీలకు ఆస్కారం లేదు'

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిప‌థంలో దూసుకుపోతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అమీర్ పేట డివిజన్‌లోని లీలానగర్‌లో రూ. 38 లక్షల వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను మంత్రి ప్రారంభించారు. కాలనీ ప్రజల అవసరాల కోసం నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను చిన్న చిన్న పంక్షన్‌లు, కాలనీ అభివృద్ధి కోసం సమావేశాల నిర్వహణ వంటి కార్యక్రమాల కోసం వినియోగించుకోవాలని పేర్కొన్నారు.

నియోజకవర్గ పరిధిలోని సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చిన వెంటనే... వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని తలసాని తెలిపారు. అనంతరం సనత్‌నగర్‌లోని నెహ్రు పార్కులో రూ. 1.50 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్ ప్లే గ్రౌండ్, ప్లే కోర్టు తదితర అభివృద్ధి పనులను ప్రారంభించారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యన్ని సహించే ప్రసక్తే లేదని అధికారులను హెచ్చరించారు.

బల్కంపేట మెయిన్ రోడ్‌లో రూ. 22 లక్షల వ్యయంతో నిర్నించనున్న స్ట్రీట్ వెండర్ జోన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. సనత్‌నగర్ ఇండస్ట్రీయల్ పార్కు సమీపంలో సైతం రూ. 26 లక్షలతో చేపట్టనున్న స్ట్రీట్ వెండర్ జోన్ నిర్మాణ పనులను ప్రారంభించారు. రోడ్లపై వివిధ వ్యాపారాలు నిర్వహించుకుంటున్న చిరు వ్యాపారుల కోసం వీటిని నిర్మిస్తున్నట్లు తెలిపారు.

చిరు వ్యాపారులు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తూ వాటిని సద్వినియోగం చేసుకోవాలని తలసాని కోరారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ ప్రావీణ్య, డీసీ వంశీ, ఈఈ ఇందిర, స్థానిక కార్పొరేటర్‌లు కొలన్ లక్ష్మీ బాల్ రెడ్డి, సరళ, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: CM KCR : 'ఎస్సీ, ఎస్టీల సాధికారతలో పైరవీలకు ఆస్కారం లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.