ETV Bharat / state

'బోనాలు అంగరంగా వైభవంగా నిర్వహిస్తున్నాం' - golkonnda bonalu

గోల్కొండ జగదాంబికా మహంకాళి బోనాలను ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్ తెలిపారు. భక్తులు అత్యధికంగా వచ్చే రోజుల్లో తదనుగుణంగా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. బోనాల సందర్భంగా వంటలు చేసుకునేందుకు ప్రత్యేక స్థలాన్ని కేటాయిస్తున్నామని చెప్పారు.

minister talasni srinivas yadav
author img

By

Published : Jul 15, 2019, 6:37 AM IST

Updated : Jul 15, 2019, 7:09 AM IST

గోల్కొండ జగదాంబికా మహంకాళి ఆషాడబోనాల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఘటాల ఊరేగింపు, బోనాల సందర్భంగా ప్రతి వేడుకను సంప్రదాయబద్ధంగా నిర్వహించాలన్నారు. భక్తుల సౌకర్యార్థం రోడ్ల మరమ్మతులు, తాగునీరు, డ్రైనేజీ, వీధిదీపాలు, ఫ్లడ్‌లైట్లు, సీసీ కెమెరాల నిఘా ఏర్పాట్ల పనులను సకాలంలో పూర్తి చేశామన్నారు. వైద్యశిబిరాలు, అంబులెన్స్​, ఆధ్యాత్మిక వాతావరణం ప్రతిభింబిచేలా కళాబృందాల ప్రదర్శనలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పారిశుద్ధ్య పనుల కోసం అదనపు సిబ్బంది, జనరేటర్లు అందుబాటులో ఉంచామని, బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.

'గోల్కొండ బోనాలు అంగరంగా వైభవంగా నిర్వహిస్తున్నాం'

ఇదీ చూడండి: వైభవంగా గోల్కొండ జగదాంబ మహంకాళి బోనాలు

గోల్కొండ జగదాంబికా మహంకాళి ఆషాడబోనాల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఘటాల ఊరేగింపు, బోనాల సందర్భంగా ప్రతి వేడుకను సంప్రదాయబద్ధంగా నిర్వహించాలన్నారు. భక్తుల సౌకర్యార్థం రోడ్ల మరమ్మతులు, తాగునీరు, డ్రైనేజీ, వీధిదీపాలు, ఫ్లడ్‌లైట్లు, సీసీ కెమెరాల నిఘా ఏర్పాట్ల పనులను సకాలంలో పూర్తి చేశామన్నారు. వైద్యశిబిరాలు, అంబులెన్స్​, ఆధ్యాత్మిక వాతావరణం ప్రతిభింబిచేలా కళాబృందాల ప్రదర్శనలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పారిశుద్ధ్య పనుల కోసం అదనపు సిబ్బంది, జనరేటర్లు అందుబాటులో ఉంచామని, బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.

'గోల్కొండ బోనాలు అంగరంగా వైభవంగా నిర్వహిస్తున్నాం'

ఇదీ చూడండి: వైభవంగా గోల్కొండ జగదాంబ మహంకాళి బోనాలు

Intro:Body:Conclusion:
Last Updated : Jul 15, 2019, 7:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.