ప్రజా సమస్యల పరిష్కారం కోసం కార్పొరేటర్లు కృషి చేయాలని... మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. హైదరాబాద్ వెస్ట్ మారేడ్పల్లిలోని ఆయన నివాసంలో... కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు.
నియోజకవర్గ పరిధిలో పర్యటించి... ప్రజా సమస్యలను తెలుసుకోవాలని, అధికారులతో చర్చించి వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానన్న మంత్రి..... ప్రధాన సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఇదీ చూడండి: వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డుల స్వాధీనానికి ప్రభుత్వం ఆదేశం