పెంపుడు జంతువులకు ప్రస్తుత కాలంలో మంచి డిమాండ్ ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. బంజారాహిల్స్లో డా.మురళీధర్, ఆయన కుమార్తె చైత్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ మై డాగ్ లగ్జరీ స్పా అండ్ సెలూన్ను ప్రారంభించారు. పెంపుడు జంతువుల సంరక్షణ కోసం అత్యాధునిక సాంకేతికతతో ఈ సెలూన్లు అందుబాటులోకి రావడం హర్షనీయన్నారు. పూర్వ కాలంలో ప్రతి ఒక్కరు పెంపుడు జంతువులను పెంచుకునే వారని... ఈ మధ్యకాలంలో పాశ్చత్య సాంస్కృతిక కారణంగా జంతువుల పెంపకం తగ్గిపోయిందన్నారు.
ప్రతి ఒక్కరు అందంగా ఉండాలని ఏవిధంగా కోరుకుంటారో... అదే విధంగా పెంచే పెంపుడు జంతువులను అందంగా తీర్చిదిద్దేందుకు ఈ తరహా సెలూన్ను అందుబాటులోకి తెచ్చినట్లు నిర్వహకురాలు చైత్ర తెలిపారు.
ఇదీ చూడండి: మోదీ 2.0: జల సంరక్షణతోనే దేశానికి ఉజ్వల భవిష్యత్తు