రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. హైదరాబాద్ ఎంసీఆర్హెచ్ఆర్డీలో జరిగిన మత్స్యకారుల సమన్వయ కమిటీ సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్, పశు సంవర్ధక శాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర, మత్స్య శాఖ కమిషనర్ భూక్యా లచ్చినాయక్, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై విస్తృతంగా చర్చించారు.
మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ స్పష్టం చేశారు. మత్స్యకారుల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకే మత్స్యకారుల సమన్వయ కమిటీ జిల్లాల పర్యటన చేస్తుందని తెలిపారు. మత్స్యకారులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనేదే సీఎం కేసీఆర్ సంకల్పమన్న మంత్రి.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేస్తున్నామని గుర్తు చేశారు. మత్స్యకారులు కలిసికట్టుగా ఉండి.. ప్రభుత్వ పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవడం ద్వారా అభివృద్ధి సాధించాలని సూచించారు.
ఇదీ చూడండి: సీఎం కేసీఆర్తో కేంద్రమంత్రి సింధియా భేటీ.. ఏఏ అంశాలు చర్చించారో తెలుసా?