హైదరాబాద్ రవీంద్రభారతి ప్రాంగణంలో నిర్వహిస్తున్న కర్రసాము శిక్షణా శిబిరాన్ని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. మహిళలకు ఆత్మరక్షణ, ధైర్య సాహసాలు పెంపొందించే దిశగా ఈ శిక్షణా శిబిరాన్ని ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు.
కర్రసాములో పీహెచ్డీ చేసిన ఆకుల శ్రీధర్ ఆధ్వర్యంలో మహిళలు, విద్యార్థులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. స్వయంగా కర్రసాము, సెల్ఫ్ డిఫెన్స్లపై విద్యార్థులకు మంత్రి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : పైసలకు పట్టాలిస్తాం... రండి బాబూ రండి...