ETV Bharat / state

SABITHA: జగన్​ అక్రమాస్తుల కేసులో సబిత డిశ్చార్జ్​ పిటిషన్​

author img

By

Published : Jul 6, 2021, 7:35 PM IST

జగన్​ అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టులో మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిశ్చార్జ్​ పిటిషన్​ దాఖలు చేశారు. ఈ కేసు నుంచి తనను తొలగించాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. డిశ్చార్జ్ పిటిషన్​పై కౌంటరు దాఖలు చేసేందుకు సీబీఐ సమయం కోరింది.

SABITHA:  జగన్​ అక్రమాస్తుల కేసులో సబిత డిశ్చార్జ్​ పిటిషన్​
SABITHA: జగన్​ అక్రమాస్తుల కేసులో సబిత డిశ్చార్జ్​ పిటిషన్​

జగన్ అక్రమాస్తుల కేసు నుంచి తనను తొలగించాలని కోరుతూ తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. గనుల శాఖ మంత్రిగా ఉన్న తనను పెన్నా సిమెంట్స్ ఛార్జ్ షీట్​లో సీబీఐ అనవసరంగా ఇరికించిందని పిటిషన్​లో మంత్రి పేర్కొన్నారు. సబితా ఇంద్రారెడ్డి డిశ్చార్జ్ పిటిషన్​పై కౌంటరు దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని కోర్టును సీబీఐ కోరింది. అంగీకరించిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణను ఈనెల 13కి వాయిదా వేసింది.

పెన్నా ఛార్జ్ షీట్​లో విశ్రాంత ఐఏఎస్ అధికారి శామ్యూల్ డిశ్చార్జ్ పిటిషన్​పై సీబీఐ కౌంటరు దాఖలు చేసింది. శామ్యూల్​ను కేసు నుంచి తొలగించవద్దని సీబీఐ కోరింది. తనను కేసు నుంచి తొలగించాలని కోరుతూ శామ్యూల్​ దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్​పై వి.డి.రాజగోపాల్ వాదనలు వినిపించారు. పయనీర్ హాలిడే రిసార్ట్స్, పీఆర్ ఎనర్జీ కంపెనీల డిశ్చార్జ్ పిటిషన్లపై కౌంటరు దాఖలు కోసం సీబీఐ గడువు కోరింది. పెన్నా సిమెంట్స్ ఛార్జ్ షీట్​కు సంబంధించిన అన్ని అంశాలపై విచారణను న్యాయస్థానం ఈనెల 13కి వాయిదా వేసింది.

జగన్ అక్రమాస్తుల కేసు నుంచి తనను తొలగించాలని కోరుతూ తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. గనుల శాఖ మంత్రిగా ఉన్న తనను పెన్నా సిమెంట్స్ ఛార్జ్ షీట్​లో సీబీఐ అనవసరంగా ఇరికించిందని పిటిషన్​లో మంత్రి పేర్కొన్నారు. సబితా ఇంద్రారెడ్డి డిశ్చార్జ్ పిటిషన్​పై కౌంటరు దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని కోర్టును సీబీఐ కోరింది. అంగీకరించిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణను ఈనెల 13కి వాయిదా వేసింది.

పెన్నా ఛార్జ్ షీట్​లో విశ్రాంత ఐఏఎస్ అధికారి శామ్యూల్ డిశ్చార్జ్ పిటిషన్​పై సీబీఐ కౌంటరు దాఖలు చేసింది. శామ్యూల్​ను కేసు నుంచి తొలగించవద్దని సీబీఐ కోరింది. తనను కేసు నుంచి తొలగించాలని కోరుతూ శామ్యూల్​ దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్​పై వి.డి.రాజగోపాల్ వాదనలు వినిపించారు. పయనీర్ హాలిడే రిసార్ట్స్, పీఆర్ ఎనర్జీ కంపెనీల డిశ్చార్జ్ పిటిషన్లపై కౌంటరు దాఖలు కోసం సీబీఐ గడువు కోరింది. పెన్నా సిమెంట్స్ ఛార్జ్ షీట్​కు సంబంధించిన అన్ని అంశాలపై విచారణను న్యాయస్థానం ఈనెల 13కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి: 'నేను రాజకీయాల్లోకి ఎప్పటికీ రాను... నా కల వేరే ఉంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.