ETV Bharat / state

ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా మాకే లాభం: మంత్రి ఆర్కే రోజా

author img

By

Published : Nov 26, 2022, 3:24 PM IST

Minister RK Roja: ఆంధ్రప్రదేశ్​లో జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాల్లో.. పాల్గొన్న మంత్రి ఆర్కే రోజా.. సీఎం జగన్ ఏ కార్యక్రమం చేసినా ప్రతిపక్షాలు తప్పుగా చూపిస్తున్నాయని ఆరోపించారు. ప్రత్యర్ధులు ఎన్ని కుట్రలు చేసిన తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

roja
roja

Minister RK Roja: సీఎం జగన్ ఏ కార్యక్రమం చేసినా ప్రతిపక్షాలు.. బూతుల్లా భూతద్దంలో చూపిస్తున్నాయని.. మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరుగుతున్న.. జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాల్లో.. ఆమె పాల్గొన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌.. సీఎం జగన్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు. ఇప్పటంలో ఇళ్ల కూల్చి వేతపై తప్పుడు సమాచారం ఇచ్చారని.. హైకోర్టు చివాట్లు పెట్టినా.. ఆ పార్టీ నేతలకు బుద్ధి రాలేదన్నారు. పవన్‌ చేసే యాత్రల వల్ల వైసీపీకే మేలు జరుగుతుందని చెప్పారు.

"రిషి కొండలో ఇప్పటికే టూరిజం ఉంది. దానిని జగన్​ మోహన్​ రెడ్డి మరింత అభివృద్ధి చూస్తున్నారు. టీడీపీ, కమ్యునిస్టు, జనసేన తమ ఉనికిని చాటేందుకే ఇలా చేస్తున్నాయి. పవన్​ కల్యాన్​ ఇప్పటం, వైజాగ్​ రావడం వల్ల వైఎస్​ఆర్​ పార్టీకే మేలు జరుగుతుంది. అది ప్రజలకు కూడా బాగా అర్థమవుతుంది".-ఆర్కే రోజా, టూరిజం మంత్రి

ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా మాకే లాభం: మంత్రి ఆర్కే రోజా

ఇవీ చదవండి:

Minister RK Roja: సీఎం జగన్ ఏ కార్యక్రమం చేసినా ప్రతిపక్షాలు.. బూతుల్లా భూతద్దంలో చూపిస్తున్నాయని.. మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరుగుతున్న.. జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాల్లో.. ఆమె పాల్గొన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌.. సీఎం జగన్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు. ఇప్పటంలో ఇళ్ల కూల్చి వేతపై తప్పుడు సమాచారం ఇచ్చారని.. హైకోర్టు చివాట్లు పెట్టినా.. ఆ పార్టీ నేతలకు బుద్ధి రాలేదన్నారు. పవన్‌ చేసే యాత్రల వల్ల వైసీపీకే మేలు జరుగుతుందని చెప్పారు.

"రిషి కొండలో ఇప్పటికే టూరిజం ఉంది. దానిని జగన్​ మోహన్​ రెడ్డి మరింత అభివృద్ధి చూస్తున్నారు. టీడీపీ, కమ్యునిస్టు, జనసేన తమ ఉనికిని చాటేందుకే ఇలా చేస్తున్నాయి. పవన్​ కల్యాన్​ ఇప్పటం, వైజాగ్​ రావడం వల్ల వైఎస్​ఆర్​ పార్టీకే మేలు జరుగుతుంది. అది ప్రజలకు కూడా బాగా అర్థమవుతుంది".-ఆర్కే రోజా, టూరిజం మంత్రి

ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా మాకే లాభం: మంత్రి ఆర్కే రోజా

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.