ETV Bharat / state

మొబైల్ లెర్నింగ్ సెంటర్​ను ప్రారంభించిన విద్యా శాఖ మంత్రి - మంత్రి సబితా ఇంద్రారెడ్డి తాజా వార్తలు

ఆటపాటలతో పిల్లలకు విద్యను బోధించేలా సేవ్ ది చిల్డ్రన్ సంస్థ ఏర్పాటు చేసిన "మొబైల్ లెర్నింగ్ సెంటర్"​ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి హైదరాబాద్​లో ప్రారంభించారు. కరోనా మహమ్మారి కారణంగా ఇళ్లకే పరిమితమైన విద్యార్థులకు వారి వద్దకే వెళ్లి పాఠాలు బోధించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

Minister of Education sabitha indrareddy  inaugurated the Mobile Learning Center in hyderabad
మొబైల్ లెర్నింగ్ సెంటర్ ప్రారంభించిన విద్యాశాఖ మంత్రి
author img

By

Published : Jan 28, 2021, 2:34 AM IST

కొవిడ్ సంక్షోభం కారణంగా ఇళ్లకే పరిమితమైన విద్యార్థులకు వారి వద్దకే వెళ్లి పాఠాలు బోధించేందుకు సేవ్ ది చిల్డ్రన్ సంస్థ ఆధ్వర్యంలో మొబైల్ లెర్నింగ్ సెంటర్​ను తీసుకొచ్చారు. మొబైల్​ లెర్నింగ్​ సెంటర్​ వాహనాన్ని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.

ఆటపాటలతో పిల్లలకు విద్య బోధించేలా మొబైల్ లెర్నింగ్ సెంటర్​ను సంస్థ సభ్యులు తీర్చిదిద్దారు. ప్రత్యేక వాహనంలో గ్రామాలకు వెళ్లి అక్కడి పాఠశాల ఆవరణలో విద్యార్థులకు.. పుస్తకాలు, ఆట పరికరాలతో పాఠాలను బోధిస్తారు. చిన్నారులను ఆకట్టుకునేలా టీవీల్లో డిజిటల్ అంశాలతోనూ వివరిస్తారు. అంగన్ వాడీ, ఫ్రీ ప్రైమరీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా వర్క్​బుక్​లను తయారు చేసినట్లు సేవ్ ది చిల్డ్రెన్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్, పాఠశాల విద్యా సంచాలకురాలు దేవసేన పాల్గొన్నారు.

కొవిడ్ సంక్షోభం కారణంగా ఇళ్లకే పరిమితమైన విద్యార్థులకు వారి వద్దకే వెళ్లి పాఠాలు బోధించేందుకు సేవ్ ది చిల్డ్రన్ సంస్థ ఆధ్వర్యంలో మొబైల్ లెర్నింగ్ సెంటర్​ను తీసుకొచ్చారు. మొబైల్​ లెర్నింగ్​ సెంటర్​ వాహనాన్ని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.

ఆటపాటలతో పిల్లలకు విద్య బోధించేలా మొబైల్ లెర్నింగ్ సెంటర్​ను సంస్థ సభ్యులు తీర్చిదిద్దారు. ప్రత్యేక వాహనంలో గ్రామాలకు వెళ్లి అక్కడి పాఠశాల ఆవరణలో విద్యార్థులకు.. పుస్తకాలు, ఆట పరికరాలతో పాఠాలను బోధిస్తారు. చిన్నారులను ఆకట్టుకునేలా టీవీల్లో డిజిటల్ అంశాలతోనూ వివరిస్తారు. అంగన్ వాడీ, ఫ్రీ ప్రైమరీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా వర్క్​బుక్​లను తయారు చేసినట్లు సేవ్ ది చిల్డ్రెన్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్, పాఠశాల విద్యా సంచాలకురాలు దేవసేన పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఫిట్‌మెంట్‌ పేరుతో కేసీఆర్ కొత్త డ్రామా: బండి సంజయ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.