సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని బాపూజీనగర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ గుడిసెలో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు వ్యాపించాయి. చుట్టుపక్కలున్న పది గుడిసెలు చూస్తుండగానే అగ్నికి ఆహుతయ్యాయి.
విషయం తెలిసిన వెంటనే కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఘటనా స్థలికి వెళ్లారు. బాధిత కుటుంబాలను పరామర్శించి... ఒక్కో కుటుంబానికి లక్షరూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.
ఇదీ చూడండి: గూడు కాలింది... గోడు మిగిలింది