ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో ఇంటింటికీ నల్లా నీరు అందించడంలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. కేంద్ర జలశక్తి శాఖ నివేదికలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు.
![minister ktr talk about Mission Bhagiratha in telangana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-hyd-13-20-ktr-on-missionbhageeratha-av-3053262_20082020104301_2008f_1597900381_100.jpg)
98.3 శాతం ఇళ్లకు నల్లాల ద్వార రక్షిత మంచి నీటిని అందిస్తున్న తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో ఉన్నట్లు కేంద్రజలశక్తి శాఖ తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళిక, గ్రామీణ నీటిసరఫరా విభాగం కృషి వల్లే ఇది సాధ్యమైందని మంత్రి అన్నారు. వారికి ధన్యవాదాలు తెలిపారు.
![minister ktr talk about Mission Bhagiratha in telangana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-hyd-13-20-ktr-on-missionbhageeratha-av-3053262_20082020104301_2008f_1597900381_442.jpg)
ఇదీ చూడండి: కరోనా పరీక్షల సామర్థ్యం పెంపుపై ఐసీఎంఆర్ సూచనలు