అంబేడ్కర్ స్ఫూర్తితో అన్ని వర్గాల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ముఖ్యమంత్రి తాజాగా ఎస్సీ సముద్ధరణకు అదనంగా కేటాయించిన రూ.1,000 కోట్లతో ఎలాంటి కార్యక్రమాలు చేపడితే మరింత మేలు జరుగుతుందనే అంశంపై మంత్రులు విస్తృతంగా చర్చించారు. నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్లోని మంత్రుల నివాస ప్రాంగణంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
ఈ భేటీలో ప్రభుత్వ విప్లు బాల్క సుమన్, గువ్వల బాలరాజు, ఎంఎస్ ప్రభాకర్, మాజీ ఉప ముఖ్యమంత్రులు డాక్టర్ టి.రాజయ్య, కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఇక్కడ చర్చించిన అంశాలను, ప్రతిపాదనలను క్రోడీకరించి తర్వలో ముఖ్యమంత్రికి సమర్పిస్తామని తెలిపారు.
ఇదీ చూడండి: సభ్యత్వ నమోదులోనూ సిద్దిపేట ముందుండాలి: హరీశ్రావు