ETV Bharat / state

MD Sailaja Kiran at silk expo: చేనేత కళలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి: శైలజా కిరణ్ - ఇండియన్ సిల్క్ ఎక్స్ పో

MD Sailaja Kiran at silk expo: చేనేత కళలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌ సూచించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ కళింగ హాలులో ఏర్పాటుచేసిన ఇండియన్ సిల్క్ ఎక్స్ పోను ఆమె ప్రారంభించారు. సాంప్రదాయంలో భాగమైన కళను ఆదరించాలని సూచించారు.

MD Sailaja Kiran at silk expo
వస్త్ర ప్రదర్శనను ప్రారంభించిన మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్
author img

By

Published : Feb 28, 2022, 9:38 PM IST

MD Sailaja Kiran at silk expo: చేనేత ఉత్పత్తులను తప్పనిసరిగా కొనుగోలు చేసి కళాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత భారతీయులందరిపై ఉందని మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్ అన్నారు. ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఆధ్వర్యంలో హైదరాబాద్ బంజారాహిల్స్ కళింగ హాలులో ఏర్పాటుచేసిన సిల్క్ ఎక్స్​పోను శైలజా కిరణ్‌ ప్రారంభించారు.

MD Sailaja Kiran at silk expo
వస్త్ర ప్రదర్శనను ప్రారంభించిన మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్

మార్చి 7వరకు జరగనున్న ఈ వస్త్రాల ప్రదర్శనలో 14 రాష్ట్రాల నుంచి 50 స్టాళ్లు ఏర్పాటు చేశారు. వాటన్నింటినీ ఆసక్తిగా పరిశీలించిన శైలజా కిరణ్‌ చేనేతలో ఉన్న నాణ్యతను మిగతావాటితో పోల్చలేమని అభిప్రాయపడ్డారు. మన సాంప్రదాయాల్లో భాగమైన చేనేత కళను ఆదరించాల్సిన అవసరముందని, ప్రభుత్వాలతోపాటు ప్రజలూ ముందుకురావాలని ఆమె సూచించారు.

MD Sailaja Kiran at silk expo
వస్త్ర ప్రదర్శనను ప్రారంభించిన మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్

ప్రస్తుతం మనదేశంలో 43 లక్షలమంది హ్యాండ్​లూమ్స్​ మీద ఆధారపడి ఉన్నారు. మొత్తం రూ.50 వేల కోట్లు ఉత్పత్తి జరుగుతోంది. పవర్​లూమ్ ఒకరోజుకు పాతిక మీటర్లు తయారు చేస్తే చేనేత వస్త్ర కేవలం ఒక మీటరే ఉత్పత్తి అవుతుంది. కానీ పవర్​ లూమ్​​ కంటే హ్యాండ్​లూమ్​లో క్వాలిటీ, మన్నిక చాలా ఎక్కువ. హ్యాండ్​లూమ్​ అనేది మన సంప్రదాయం. మనం చేనేత కళలను ఆదరించడం బాధ్యతగా తీసుకోవాలి. ప్రతి ఒక్కటీ ప్రభుత్వమే చేయాలని కాదు. మనం కూడా చేనేత కళలను ప్రోత్సహించాలి. ప్రభుత్వం కూడా బతుకమ్మ పండుగ చీరలతో వారికి అండగా నిలుస్తోంది. - శైలజా కిరణ్​, మార్గదర్శి ఎండీ

మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌

ఇదీ చూడండి:
Numaish Exhibition : భాగ్యనగర వాసులకు గుడ్​న్యూస్​.. రేపటి నుంచే నుమాయిష్​

MD Sailaja Kiran at silk expo: చేనేత ఉత్పత్తులను తప్పనిసరిగా కొనుగోలు చేసి కళాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత భారతీయులందరిపై ఉందని మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్ అన్నారు. ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఆధ్వర్యంలో హైదరాబాద్ బంజారాహిల్స్ కళింగ హాలులో ఏర్పాటుచేసిన సిల్క్ ఎక్స్​పోను శైలజా కిరణ్‌ ప్రారంభించారు.

MD Sailaja Kiran at silk expo
వస్త్ర ప్రదర్శనను ప్రారంభించిన మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్

మార్చి 7వరకు జరగనున్న ఈ వస్త్రాల ప్రదర్శనలో 14 రాష్ట్రాల నుంచి 50 స్టాళ్లు ఏర్పాటు చేశారు. వాటన్నింటినీ ఆసక్తిగా పరిశీలించిన శైలజా కిరణ్‌ చేనేతలో ఉన్న నాణ్యతను మిగతావాటితో పోల్చలేమని అభిప్రాయపడ్డారు. మన సాంప్రదాయాల్లో భాగమైన చేనేత కళను ఆదరించాల్సిన అవసరముందని, ప్రభుత్వాలతోపాటు ప్రజలూ ముందుకురావాలని ఆమె సూచించారు.

MD Sailaja Kiran at silk expo
వస్త్ర ప్రదర్శనను ప్రారంభించిన మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్

ప్రస్తుతం మనదేశంలో 43 లక్షలమంది హ్యాండ్​లూమ్స్​ మీద ఆధారపడి ఉన్నారు. మొత్తం రూ.50 వేల కోట్లు ఉత్పత్తి జరుగుతోంది. పవర్​లూమ్ ఒకరోజుకు పాతిక మీటర్లు తయారు చేస్తే చేనేత వస్త్ర కేవలం ఒక మీటరే ఉత్పత్తి అవుతుంది. కానీ పవర్​ లూమ్​​ కంటే హ్యాండ్​లూమ్​లో క్వాలిటీ, మన్నిక చాలా ఎక్కువ. హ్యాండ్​లూమ్​ అనేది మన సంప్రదాయం. మనం చేనేత కళలను ఆదరించడం బాధ్యతగా తీసుకోవాలి. ప్రతి ఒక్కటీ ప్రభుత్వమే చేయాలని కాదు. మనం కూడా చేనేత కళలను ప్రోత్సహించాలి. ప్రభుత్వం కూడా బతుకమ్మ పండుగ చీరలతో వారికి అండగా నిలుస్తోంది. - శైలజా కిరణ్​, మార్గదర్శి ఎండీ

మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌

ఇదీ చూడండి:
Numaish Exhibition : భాగ్యనగర వాసులకు గుడ్​న్యూస్​.. రేపటి నుంచే నుమాయిష్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.