ETV Bharat / state

రోడ్లెక్కుతున్నారా జాగ్రత్త... డైరెక్ట్​ పోలీస్​స్టేషనే...!

రోడ్లపై వాహనదారులు చక్కర్లు కొడుతున్నారు. లాక్​డౌన్ అమల్లో ఉన్నప్పటికీ ఎలాంటి పట్టింపు లేకుండా ఇష్టారీతిగా రోడ్లపై సంచరిస్తున్నారు. హైదరాబాద్​లోని సంగీత్, రాణిగుంజ్, బేగంపేట, ఓలిఫెంటా బ్రిడ్జితో పాటు పలు కూడళ్ళ వద్ద తిరుగుతున్న వాహానాలను పోలీసులు సీజ్​ చేస్తున్నారు.

author img

By

Published : May 8, 2020, 2:48 PM IST

many bikes sized in secudrabad roads
రోడ్లెక్కుతున్నారా జాగ్రత్త... డైరెక్ట్​ పోలీస్​స్టేషనే...!

హైదరాబాద్​లో మామూలు రోజుల్లో లాగానే వాహనాల రద్దీ ఉండటం వల్ల వాహనదారులను ఆపి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కేవలం అత్యవసర సేవలకు సంబంధించిన వాహనాలకు మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ... ప్రతి ఒక్కరూ బయటకు రావడం వల్ల పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

లాక్​డౌన్ అమలవుతున్న సమయంలో వాహనదారులు ఇంటి నుండి బయటకు రావద్దని చెప్పినా పట్టించుకోకపోవటాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇప్పటి వరకు గోపాలపురం ట్రాఫిక్ పోలీసులు 40 వాహనాలు సీజ్ చేశారు. మారేడ్​పల్లి వద్ద 25 వాహనాలను సీజ్ చేశారు.

ఇదీ చూడండి:భోపాల్​ నుంచి విశాఖ వరకు.. చీకటి నింపిన గ్యాస్​ లీక్​లెన్నో...

హైదరాబాద్​లో మామూలు రోజుల్లో లాగానే వాహనాల రద్దీ ఉండటం వల్ల వాహనదారులను ఆపి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కేవలం అత్యవసర సేవలకు సంబంధించిన వాహనాలకు మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ... ప్రతి ఒక్కరూ బయటకు రావడం వల్ల పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

లాక్​డౌన్ అమలవుతున్న సమయంలో వాహనదారులు ఇంటి నుండి బయటకు రావద్దని చెప్పినా పట్టించుకోకపోవటాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇప్పటి వరకు గోపాలపురం ట్రాఫిక్ పోలీసులు 40 వాహనాలు సీజ్ చేశారు. మారేడ్​పల్లి వద్ద 25 వాహనాలను సీజ్ చేశారు.

ఇదీ చూడండి:భోపాల్​ నుంచి విశాఖ వరకు.. చీకటి నింపిన గ్యాస్​ లీక్​లెన్నో...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.