ETV Bharat / state

ప్రజల తీర్పును శిరసా వహిస్తాం: మాణిక్కం ఠాగూర్‌

author img

By

Published : Dec 5, 2020, 7:00 AM IST

బల్దియా ఫలితాలపై రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్కం ఠాగూర్‌ స్పందించారు. గెలుపొందిన ఇద్దరిని ఆయన అభినందించారు. ప్రజల తీర్పును స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు.

manickam tagore on congress victory in two divisions
ప్రజల తీర్పును శిరసా వహిస్తాం: మాణికం ఠాగూర్‌

గ్రేటర్‌ ఎన్నికల్లో గెలుపొందిన ఇద్దరు అభ్యర్థులకు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్కం ఠాగూర్‌, ఎంపీ రేవంత్‌ రెడ్డిలు అభినందనలు తెలిపారు. ఉప్పల్‌ అసెంబ్లీ నియోజక వర్గంలోని ఏఎస్‌రావు నగర్‌ నుంచి గెలుపొందిన శిరీషా సోమశేఖర్‌రెడ్డి, ఉప్పల్‌ డివిజన్‌ నుంచి విజయం సాధించిన రజిత పరమేశ్వర్‌ రెడ్డిలను ట్విట్టర్‌ వేదికగా అభినందించారు.

ప్రజా తీర్పును తాము శిరసా వహిస్తామని మాణికం ఠాగూర్‌ తెలిపారు. గ్రేటర్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థుల తరఫున కృషి చేసిన పార్టీ శ్రేణులను ఎంపీ రేవంత్‌ రెడ్డి అభినందించారు.

గ్రేటర్‌ ఎన్నికల్లో గెలుపొందిన ఇద్దరు అభ్యర్థులకు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్కం ఠాగూర్‌, ఎంపీ రేవంత్‌ రెడ్డిలు అభినందనలు తెలిపారు. ఉప్పల్‌ అసెంబ్లీ నియోజక వర్గంలోని ఏఎస్‌రావు నగర్‌ నుంచి గెలుపొందిన శిరీషా సోమశేఖర్‌రెడ్డి, ఉప్పల్‌ డివిజన్‌ నుంచి విజయం సాధించిన రజిత పరమేశ్వర్‌ రెడ్డిలను ట్విట్టర్‌ వేదికగా అభినందించారు.

ప్రజా తీర్పును తాము శిరసా వహిస్తామని మాణికం ఠాగూర్‌ తెలిపారు. గ్రేటర్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థుల తరఫున కృషి చేసిన పార్టీ శ్రేణులను ఎంపీ రేవంత్‌ రెడ్డి అభినందించారు.

ఇదీ చదవండి: గ్రేటర్ ఎన్నికల్లో సామాజిక మాధ్యమాల ప్రభావం ఎంత..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.