మీర్పేట్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ కానిస్టేబుల్ ఇంట్లో దొంగతనం జరిగింది హైదరాబాద్ సరూర్నగర్ మండలం మీర్పేట్ పోలీస్స్టేషన్ పరిధిలోని అల్మాస్గూడలో ఓ కానిస్టేబుల్ ఇంట్లో దొంగతనం జరిగింది. రాచకొండ పోలీస్ కమిషనరేట్లో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న మనోహర్ రెడ్డి రాత్రి 11 గంటల సమయంలో భోజనం ముగించుకుని నిద్రకు ఉపక్రమించారు.
అర్ధరాత్రి వంటగది నుంచి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు రూ.7 లక్షల నగదు, 16.5 తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లారు. ఉదయం ఇల్లంతా చిందరవందరగా ఉండటంతో విషయం గ్రహించిన మనోహర్ ఠాణాలో ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి :ఒక్క విమానమైనా కొన్నారా?