ETV Bharat / state

Lokesh On Pegasus: పెగాసస్‌పై ఎలాంటి విచారణకైనా సిద్ధం: నారా లోకేశ్‌

author img

By

Published : Mar 21, 2022, 5:37 PM IST

Lokesh On Pegasus: మద్యం మరణాలపై ప్రతి రోజూ డిమాండ్ చేస్తోంటే చర్చకు అనుమతించకుండా.. తప్పుడు సమాచారంతో పెగాసస్​పై చర్చ పెట్టారని తెదేపా నేత లోకేశ్ ఆక్షేపించారు. పెగాసస్‌పై ఎలాంటి విచారణకైనా సిద్ధమన్న లోకేశ్.. బాబాయ్ హత్య, మద్యం మరణాలపైనా విచారణ కమిటీ వేయగలరా..? అని ముఖ్యమంత్రి జగన్​ను ప్రశ్నించారు.

Lokesh On Pegasus
Lokesh On Pegasus

Lokesh On Pegasus: పెగాసస్‌పై ఎలాంటి విచారణకైనా సిద్ధమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సవాల్ విసిరారు. బాబాయ్ వివేకా హత్య, మద్యం మరణాలపైనా విచారణ కమిటీ వేయగలరా ? అని ముఖ్యమంత్రి జగన్​ను ఆయన ప్రశ్నించారు. పెగాసస్‌పై మమత అసెంబ్లీలో మాట్లాడారనే దానిపై స్పష్టత లేదన్నారు. పెగాసెస్ సాఫ్ట్‌వేర్​ను తాము కొనలేదని మాజీ డీజీపీ సవాంగ్ ఆర్టీఐ దరఖాస్తుదారుకు సమాధానం ఇచ్చారని గుర్తు చేశారు. వ్యక్తిగత విషయాలు వినే అలవాటు తమకెవరికీ లేదన్న లోకేశ్.. వైకాపా ఎమ్మెల్యే అంబటికి ఉందేమోనని అందుకే ఆయన రాసలీలలు బయట పడ్డాయని దుయ్యబట్టారు.

వ్యక్తులకు, ప్రైవేట్ సంస్ధలకు పెగాసెస్ సాఫ్ట్ వేర్ అమ్మలేదని ఇజ్రాయిల్ అంబాసిడర్ ప్రకటన కూడా చేశారన్నారు. అయినా నిబంధనలకు విరుద్దంగా సభలో పెగాసెస్ సాఫ్ట్​వేర్​పై స్వల్ప కాలిక చర్చకు అనుమతించరని మండిపడ్డారు. తాము మద్యం మరణాలపై ప్రతి రోజూ డిమాండ్ చేస్తోంటే చర్చకు అనుమతించటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారంతో సభలో పెగాసస్​పై చర్చ పెట్టారని ఆక్షేపించారు. కల్తీ సారా, కల్తీ మద్యంతో పేదలను చంపేస్తున్నారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

"పెగాసస్‌పై మమత అసెంబ్లీలో మాట్లాడారనే దానిపై స్పష్టత లేదు. పెగాసెస్ సాఫ్ట్‌వేర్ కొనలేదని మాజీ డీజీపీ సవాంగ్ ఆర్టీఐ దరఖాస్తు దారుకు సమాధానం ఇచ్చారు. వ్యక్తులకు.. ప్రైవేట్ సంస్ధలకు పెగాసెస్ సాఫ్ట్ వేర్ అమ్మలేదని ఇజ్రాయిల్ అంబాసిడర్ ప్రకటన కూడా చేశారు. అయినా నిబంధనలకు విరుద్దంగా సభలో పెగాసెస్ సాఫ్ట్ వేర్ పై స్వల్ప కాలిక చర్చకు అనుమతించారు. మేం మద్యం మరణాలపై ప్రతి రోజూ డిమాండ్ చేస్తోంటే చర్చకు అనుమతించడం లేదు. ఏమన్నా అంటే 151 మంది ఉన్నారని అంటున్నారు.. భవిష్యత్తులో వైసీపీకి 15 మంది ఉండని పరిస్థితి. బాబాయ్ హత్య విషయంలోనూ అబద్దాలే ఆడారు.. డీఎస్పీ ప్రమోషన్ల విషయంవోనూ అబద్దాలే చెప్పారు."- లోకేశ్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి

ఇదీ చదవండి

ఆ దృష్టి మళ్లించేందుకే.. పెగాసెస్ అంశాన్ని చర్చకు తీసుకొచ్చారు: తెదేపా

Lokesh On Pegasus: పెగాసస్‌పై ఎలాంటి విచారణకైనా సిద్ధమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సవాల్ విసిరారు. బాబాయ్ వివేకా హత్య, మద్యం మరణాలపైనా విచారణ కమిటీ వేయగలరా ? అని ముఖ్యమంత్రి జగన్​ను ఆయన ప్రశ్నించారు. పెగాసస్‌పై మమత అసెంబ్లీలో మాట్లాడారనే దానిపై స్పష్టత లేదన్నారు. పెగాసెస్ సాఫ్ట్‌వేర్​ను తాము కొనలేదని మాజీ డీజీపీ సవాంగ్ ఆర్టీఐ దరఖాస్తుదారుకు సమాధానం ఇచ్చారని గుర్తు చేశారు. వ్యక్తిగత విషయాలు వినే అలవాటు తమకెవరికీ లేదన్న లోకేశ్.. వైకాపా ఎమ్మెల్యే అంబటికి ఉందేమోనని అందుకే ఆయన రాసలీలలు బయట పడ్డాయని దుయ్యబట్టారు.

వ్యక్తులకు, ప్రైవేట్ సంస్ధలకు పెగాసెస్ సాఫ్ట్ వేర్ అమ్మలేదని ఇజ్రాయిల్ అంబాసిడర్ ప్రకటన కూడా చేశారన్నారు. అయినా నిబంధనలకు విరుద్దంగా సభలో పెగాసెస్ సాఫ్ట్​వేర్​పై స్వల్ప కాలిక చర్చకు అనుమతించరని మండిపడ్డారు. తాము మద్యం మరణాలపై ప్రతి రోజూ డిమాండ్ చేస్తోంటే చర్చకు అనుమతించటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారంతో సభలో పెగాసస్​పై చర్చ పెట్టారని ఆక్షేపించారు. కల్తీ సారా, కల్తీ మద్యంతో పేదలను చంపేస్తున్నారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

"పెగాసస్‌పై మమత అసెంబ్లీలో మాట్లాడారనే దానిపై స్పష్టత లేదు. పెగాసెస్ సాఫ్ట్‌వేర్ కొనలేదని మాజీ డీజీపీ సవాంగ్ ఆర్టీఐ దరఖాస్తు దారుకు సమాధానం ఇచ్చారు. వ్యక్తులకు.. ప్రైవేట్ సంస్ధలకు పెగాసెస్ సాఫ్ట్ వేర్ అమ్మలేదని ఇజ్రాయిల్ అంబాసిడర్ ప్రకటన కూడా చేశారు. అయినా నిబంధనలకు విరుద్దంగా సభలో పెగాసెస్ సాఫ్ట్ వేర్ పై స్వల్ప కాలిక చర్చకు అనుమతించారు. మేం మద్యం మరణాలపై ప్రతి రోజూ డిమాండ్ చేస్తోంటే చర్చకు అనుమతించడం లేదు. ఏమన్నా అంటే 151 మంది ఉన్నారని అంటున్నారు.. భవిష్యత్తులో వైసీపీకి 15 మంది ఉండని పరిస్థితి. బాబాయ్ హత్య విషయంలోనూ అబద్దాలే ఆడారు.. డీఎస్పీ ప్రమోషన్ల విషయంవోనూ అబద్దాలే చెప్పారు."- లోకేశ్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి

ఇదీ చదవండి

ఆ దృష్టి మళ్లించేందుకే.. పెగాసెస్ అంశాన్ని చర్చకు తీసుకొచ్చారు: తెదేపా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.