ETV Bharat / state

పల్లెల్లో 'పంచాయతీ' రాజకీయం.. ఎన్నికలపై సందిగ్ధం!

రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికల నిర్వహణపై ఉత్తర్వులు జారీ చేయటంతో.. గ్రామాల్లో రాజకీయం వేడక్కనుంది. అటు ప్రభుత్వం ఎన్నికల నిర్వహించలేమని చెప్పటం.. ఇటు ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులు జారీ చేయటంతో.. అసలు ఎన్నికలు జరుగుతాయో లేదో అన్న సందిగ్ధత ఏర్పడింది. ఆంధ్రాలో ఏం జరుగుతోందో.. అర్థంకాని పరిస్థితి నెలకొంది.

author img

By

Published : Jan 9, 2021, 3:47 PM IST

Updated : Jan 9, 2021, 4:16 PM IST

local-election-arrangements-in-west-godavari-district-ap
పల్లెల్లో 'పంచాయతీ' రాజకీయం.. ఎన్నికలపై సందిగ్ధం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘ నిర్ణయంతో పంచాయతీ సమరంపై జిల్లాలోని పల్లెల్లో జోరుగా చర్చలు మొదలయ్యాయి. ఎన్నికల నిర్వహణపై ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. నోటిఫికేషన్‌ విడుదల చేయనున్న తేదీలను ఆయన వెల్లడించారు. ఈ నెల 9 నుంచి ఎన్నికల నియమావళి అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 5, 7, 9, 17 తేదీల్లో నాలుగు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. నోటిఫికేషన్‌ జారీతో గ్రామాల్లో రాజకీయం వేడెక్కనుంది.

ఇదీ పరిస్థితి :

ఎన్నికలకు సంబంధించి జిల్లాలో పంచాయతీలు వారీగా తయారు చేసిన తుది ఓటర్ల జాబితాను ఇప్పటికే ప్రచురించారు. వార్డుల్లో కులాల వారీగా జాబితాను సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా 909 గ్రామ పంచాయతీలు, 9752 వార్డులు ఉన్నాయి. వీటిలో పోలవరం ప్రాజెక్టు పరిధిలో మామిడిగొందు, పైడిపాక గ్రామాలు డీనోటిఫై అయ్యాయి. ఆకివీడు మేజరు పంచాయతీ నగర పంచాయతీగా మారింది. వీటితో పాటు మరో 19 పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేశారు.

ఈ విధంగా 22 పంచాయతీలను మినహాయించగా.. జిల్లాలో మరో 12 కొత్తగా పంచాయతీలు ఏర్పడ్డాయి. వీటిన్నింటినీ కలిపితే 899 పంచాయతీలు ఉన్నాయి. ఇటీవల కొన్ని పురపాలక సంఘాల్లో నాలుగు పంచాయతీలు విలీనం కావడంతో 895 పంచాయతీలకు రిజర్వేషన్‌ పూర్తయి ఎన్నికలకు సిద్ధమయ్యాయి. పునర్విభజనలో భాగంగా ఆయా మండలాల్లో 1,33,349 ఓట్ల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం జిల్లాలో 24,17,567 మంది ఓటర్లు ఉన్నారు. కరోనా, వ్యాక్సిన్‌ పంపిణీ తదితర కారణాలతో ఎన్నికల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం సుముఖంగా లేదు. దీంతో ఎన్నికలు జరుగుతాయో లేదో అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘ నిర్ణయంతో పంచాయతీ సమరంపై జిల్లాలోని పల్లెల్లో జోరుగా చర్చలు మొదలయ్యాయి. ఎన్నికల నిర్వహణపై ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. నోటిఫికేషన్‌ విడుదల చేయనున్న తేదీలను ఆయన వెల్లడించారు. ఈ నెల 9 నుంచి ఎన్నికల నియమావళి అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 5, 7, 9, 17 తేదీల్లో నాలుగు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. నోటిఫికేషన్‌ జారీతో గ్రామాల్లో రాజకీయం వేడెక్కనుంది.

ఇదీ పరిస్థితి :

ఎన్నికలకు సంబంధించి జిల్లాలో పంచాయతీలు వారీగా తయారు చేసిన తుది ఓటర్ల జాబితాను ఇప్పటికే ప్రచురించారు. వార్డుల్లో కులాల వారీగా జాబితాను సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా 909 గ్రామ పంచాయతీలు, 9752 వార్డులు ఉన్నాయి. వీటిలో పోలవరం ప్రాజెక్టు పరిధిలో మామిడిగొందు, పైడిపాక గ్రామాలు డీనోటిఫై అయ్యాయి. ఆకివీడు మేజరు పంచాయతీ నగర పంచాయతీగా మారింది. వీటితో పాటు మరో 19 పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేశారు.

ఈ విధంగా 22 పంచాయతీలను మినహాయించగా.. జిల్లాలో మరో 12 కొత్తగా పంచాయతీలు ఏర్పడ్డాయి. వీటిన్నింటినీ కలిపితే 899 పంచాయతీలు ఉన్నాయి. ఇటీవల కొన్ని పురపాలక సంఘాల్లో నాలుగు పంచాయతీలు విలీనం కావడంతో 895 పంచాయతీలకు రిజర్వేషన్‌ పూర్తయి ఎన్నికలకు సిద్ధమయ్యాయి. పునర్విభజనలో భాగంగా ఆయా మండలాల్లో 1,33,349 ఓట్ల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం జిల్లాలో 24,17,567 మంది ఓటర్లు ఉన్నారు. కరోనా, వ్యాక్సిన్‌ పంపిణీ తదితర కారణాలతో ఎన్నికల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం సుముఖంగా లేదు. దీంతో ఎన్నికలు జరుగుతాయో లేదో అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

Last Updated : Jan 9, 2021, 4:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.