ETV Bharat / state

వామపక్షాల శాంతియుత ఆందోళన.. నాయకులు అరెస్ట్

author img

By

Published : Dec 13, 2020, 1:57 PM IST

రైతుల పోరాటానికి మద్దతుగా అదాని, అంబానీ ఉత్పత్తులను బహిష్కరించాలనే పిలుపుతో హిమయత్ నగర్​లోని ఓ దుకాణం ముందు వామపక్ష నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కార్పొరేట్ శక్తులకు కేంద్రం ఊడిగం చేస్తోందని ఆరోపించారు. నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

left parties protest for farmers at himayat nagar in hyderabad
సీపీఎం శాంతియుత ఆందోళన... నాయకులు అరెస్ట్

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు శాంతియుత నిరసన చేపట్టాయి. కార్పొరేట్ శక్తులు, కేంద్రం కలిసి అన్నదాతలను కుట్రదారులుగా, ఉగ్రవాదులుగా చిత్రీకరించడం సరైనది కాదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పోరాటానికి మద్దతుగా అదాని, అంబానీ ఉత్పత్తులను బహిష్కరించాలనే పిలుపుతో హిమాయత్ నగర్​లోని ఓ దుకాణం ముందు నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

రైతుల చేపట్టిన ఆందోళన 17వ రోజుకు చేరుకుందని ఆయన తెలిపారు. నాలుగు వందల రైతు సంఘాలు కలిసి చేస్తోన్న ఆందోళనపై కొందరు మంత్రులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్ శక్తులకు కేంద్రం ఊడిగం చేస్తోందని ఆయన ఆరోపించారు.

శాంతియుతంగా నిరసన చేస్తున్న బి.వి.రాఘవులు, నంద్యాల నరసింహారెడ్డి, డీజీ నరసింహారావు, ఇతర ప్రజా సంఘాల నాయకులు టి.సాగర్, స్కైలాబ్ బాబు, విజయ్, బి. ప్రసాద్ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు.

ఇదీ చదవండి: వాడిన పూలు వికసించెనే.. పడతి ప్రగతికి సహకరించెనే...

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు శాంతియుత నిరసన చేపట్టాయి. కార్పొరేట్ శక్తులు, కేంద్రం కలిసి అన్నదాతలను కుట్రదారులుగా, ఉగ్రవాదులుగా చిత్రీకరించడం సరైనది కాదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పోరాటానికి మద్దతుగా అదాని, అంబానీ ఉత్పత్తులను బహిష్కరించాలనే పిలుపుతో హిమాయత్ నగర్​లోని ఓ దుకాణం ముందు నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

రైతుల చేపట్టిన ఆందోళన 17వ రోజుకు చేరుకుందని ఆయన తెలిపారు. నాలుగు వందల రైతు సంఘాలు కలిసి చేస్తోన్న ఆందోళనపై కొందరు మంత్రులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్ శక్తులకు కేంద్రం ఊడిగం చేస్తోందని ఆయన ఆరోపించారు.

శాంతియుతంగా నిరసన చేస్తున్న బి.వి.రాఘవులు, నంద్యాల నరసింహారెడ్డి, డీజీ నరసింహారావు, ఇతర ప్రజా సంఘాల నాయకులు టి.సాగర్, స్కైలాబ్ బాబు, విజయ్, బి. ప్రసాద్ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు.

ఇదీ చదవండి: వాడిన పూలు వికసించెనే.. పడతి ప్రగతికి సహకరించెనే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.