హైదరాబాద్ బషీర్బాగ్లోని విద్యుత్ అమరవీరుల స్థూపానికి కాంగ్రెస్, సీపీఐ (ఎంఎల్), న్యూ డెమోక్రసీ నాయకులు నివాళులర్పించారు. 2000 ఆగస్టు 28న పెరిగిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఛలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించారన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ర్యాలీగా వెళ్తున్న ప్రజలపై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం కాల్పులు జరిపిందన్నారు. ఈ ఘటనలో ముగ్గురు అమరులయ్యారని తెలిపారు.
ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాల వైఖరి మార్చుకోకపోతే ప్రజా ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: 'రామోజీ ఫిల్మ్సిటీలో వైభవంగా ఈటీవీ రజతోత్సవం'