ETV Bharat / state

సబ్‌ రిజిస్ట్రార్‌, రెవెన్యూ కార్యాలయాలకు నెట్‌వర్క్‌ అనుసంధానం వేగవంతం

author img

By

Published : Sep 22, 2020, 5:09 AM IST

Updated : Sep 22, 2020, 6:48 AM IST

వ్యవసాయ, వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లను రెండు శాఖలు వేర్వేరుగా చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం అటు స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖకు, ఇటు సబ్‌ రిజిస్ట్రార్‌ విధులు నిర్వహించనున్న తహసీల్దార్లకు చట్టాలపై శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్‌ చట్టాలపై.. మరొకసారి శిక్షణ ఇవ్వనున్న ప్రభుత్వం.. సబ్‌ రిజిస్ట్రార్లకు మున్సిపల్‌ చట్టాలపై శిక్షణ ఇవ్వనుంది. నెలాఖరు నుంచి కానీ... వచ్చే నెల మొదటి వారంలో కానీ.. రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖలు తిరిగి ప్రారంభించేందుకు సర్కారు చర్యలు ముమ్మరం చేసింది.

land registrations department in telangana
సబ్‌ రిజిస్ట్రార్‌, రెవెన్యూ కార్యాలయాలకు నెట్‌వర్క్‌ అనుసంధానం వేగవంతం

రాష్ట్రంలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు రెవెన్యూ శాఖకు... వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు అన్నింటిని స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ చేసేట్లు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం... ఆ దిశలో చర్యలు ముమ్మరం చేసింది. ఇప్పటికే రిజిస్ట్రేషన్లను పూర్తిగా నిలుపుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం... మండల రెవెన్యూ కార్యాలయాల్లో వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్లు నిర్వహించి ఆ వెంటనే మ్యుటేషన్‌ పూర్తి చేసేట్లు.. చర్యలు ముమ్మరమయ్యాయి. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు, రెవెన్యూ కార్యాలయాలకు.. నెట్‌వర్క్‌ అనుసంధానం చేసే కార్యక్రమం వేగవంతమైంది. రెండు శాఖల్లోనూ జరుగుతున్న సమూల మార్పులు.. చేర్పులతో పూర్తి పారదర్శకత వస్తుందని.. అవినీతికి అస్కారం లేని సేవలు అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. అదే విధంగా ఇప్పటివరకు సబ్‌ రిజిస్ట్రార్లకు ఉన్న విచక్షణాధికారాలకు కత్తెర వేసే దిశలో కూడా చర్యలు మొదలయ్యాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సెక్షన్‌ 47 సబ్‌ సెక్షన్‌ ఏని... పూర్తిగా రద్దు చేయడం ద్వారా సబ్‌రిజిస్ట్రార్లకు ఉన్న విచక్షణాధికారాలు తొలగిపోయి.. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అవినీతికి అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

క్రయవిక్రయదారులే నేరుగా..

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టానికి సవరణ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. అటు రిజిస్ట్రేషన్ అనంతరం డాక్యుమెంట్​ను స్కాన్ చేసి అప్​లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే స్కాన్​డ్ కాపీని ఇస్తారు. ఇందుకు ప్రస్తుతం 24 గంటల సమయం తీసుకుంటున్నారు. ఇది కూడా అవినీతికి ఆస్కారం కల్పిస్తోందని అంటున్నారు. స్కాన్​డ్ కాపీ కోసం మళ్లీ వెళ్లడం, డాక్యుమెంట్ రైటర్ల పాత్ర వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు గుర్చించారు. దీంతో స్కానింగ్ కోసం కూడా 24 గంటల పాటు ఆగకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైన వెంటనే స్కానింగ్ పూర్తయ్యేలా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అవసరమైతే మల్టీనేషనల్ కంపెనీలకు టెండర్ ద్వారా స్కానింగ్ బాధ్యతను అప్పగించి ఆ వెంటనే స్కాన్​డ్ కాపీని అందించేలా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. రిజిస్ట్రేషన్ల కోసం డాక్యుమెంట్ రైటర్లపై ఆధారకుండా క్రయవిక్రయదారులు నేరుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకునేలా కూడా అవసరమైన ఏర్పాట్లు చేయనున్నారు. ఇందుకోసం అవసరమైన నమూనా పత్రాలను ప్రభుత్వమే సిద్ధం చేస్తోంది. కేవలం పేర్లు, వివరాలు నమోదు చేసుకోవడం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం డాక్యుమెంట్​ను సిద్ధం చేసుకునేలా నమూనా పత్రాలను సిద్ధం చేస్తున్నారు.

తహసీల్దార్లకు మరోసారి శిక్షణ

తహసీల్దార్లు.. సబ్‌ రిజిస్ట్రార్ల విధులను నిర్వహించాల్సి ఉండడంతో గతంలో ఒకసారి రిజిస్ట్రేషన్ల చట్టంపై శిక్షణ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం... మరొకసారి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. రిజిస్ట్రేషన్‌ చట్టం-1908, స్టాంపుల చట్టం-1899 లపై శిక్షణ ఇవ్వడం ద్వారా... భవిష్యత్తులో తహసీల్దార్లు.. రిజిస్ట్రేషన్లు చేసేందుకు ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఒకట్రెండు రోజులు చట్టాలపై శిక్షణ ఇవ్వాలని యోచిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. అవసరమైతే తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్‌లపై కూడా ఒకట్రెండు రోజులు శిక్షణ ఇస్తారు. అదేవిధంగా సబ్‌ రిజిస్ట్రార్లకు మున్సిపల్‌ చట్టాలపై శిక్షణ ఇచ్చి.. అవగాహన కల్పించడం ద్వారా రిజిస్ట్రేషన్లు పూర్తవగానే.. మ్యుటేషన్లు చేసేందుకు సబ్‌ రిజిస్ట్రార్లకు ఇబ్బందులు తలెత్తవని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే క్యాడ్‌ సాప్ట్‌వేర్‌ను ఉపయోగించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేస్తున్న రిజిస్ట్రేషన్‌ శాఖకు... ధరణి పోర్టల్‌ను కూడా అనుసంధానం చేయనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా.. తహసీల్దార్‌ కార్యాలయాలకు కూడా ఈ రెండు సాఫ్ట్​వేర్లు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. అయితే ధరణి పోర్టల్‌ అనుసంధానంతో.. ఈసీలు ఇవ్వడానికి ఇబ్బందులు ఏర్పడతాయని రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్న తర్వాత... రిజిస్ట్రేషన్లను తిరిగి ప్రారంభించాలని భావిస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చి పెట్టే శాఖల్లో.. రిజిస్ట్రేషన్ల శాఖ ఒకటి. అలాంటి శాఖ విషయంలో.. ఏ మాత్రం అలసత్వం జరగకుండా అవసరమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటోంది. ఈ నెల చివర నాటికి... అన్ని చర్యలు పూర్తి చేసి రెండు శాఖల్లో ఒకేసారి రిజిస్ట్రేషన్లను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది.


ఇవీ చూడండి: కాంగ్రెస్, భాజపాలు తెరాసకు పోటీ కానే కావు: మంత్రి ఎర్రబెల్లి

రాష్ట్రంలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు రెవెన్యూ శాఖకు... వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు అన్నింటిని స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ చేసేట్లు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం... ఆ దిశలో చర్యలు ముమ్మరం చేసింది. ఇప్పటికే రిజిస్ట్రేషన్లను పూర్తిగా నిలుపుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం... మండల రెవెన్యూ కార్యాలయాల్లో వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్లు నిర్వహించి ఆ వెంటనే మ్యుటేషన్‌ పూర్తి చేసేట్లు.. చర్యలు ముమ్మరమయ్యాయి. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు, రెవెన్యూ కార్యాలయాలకు.. నెట్‌వర్క్‌ అనుసంధానం చేసే కార్యక్రమం వేగవంతమైంది. రెండు శాఖల్లోనూ జరుగుతున్న సమూల మార్పులు.. చేర్పులతో పూర్తి పారదర్శకత వస్తుందని.. అవినీతికి అస్కారం లేని సేవలు అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. అదే విధంగా ఇప్పటివరకు సబ్‌ రిజిస్ట్రార్లకు ఉన్న విచక్షణాధికారాలకు కత్తెర వేసే దిశలో కూడా చర్యలు మొదలయ్యాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సెక్షన్‌ 47 సబ్‌ సెక్షన్‌ ఏని... పూర్తిగా రద్దు చేయడం ద్వారా సబ్‌రిజిస్ట్రార్లకు ఉన్న విచక్షణాధికారాలు తొలగిపోయి.. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అవినీతికి అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

క్రయవిక్రయదారులే నేరుగా..

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టానికి సవరణ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. అటు రిజిస్ట్రేషన్ అనంతరం డాక్యుమెంట్​ను స్కాన్ చేసి అప్​లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే స్కాన్​డ్ కాపీని ఇస్తారు. ఇందుకు ప్రస్తుతం 24 గంటల సమయం తీసుకుంటున్నారు. ఇది కూడా అవినీతికి ఆస్కారం కల్పిస్తోందని అంటున్నారు. స్కాన్​డ్ కాపీ కోసం మళ్లీ వెళ్లడం, డాక్యుమెంట్ రైటర్ల పాత్ర వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు గుర్చించారు. దీంతో స్కానింగ్ కోసం కూడా 24 గంటల పాటు ఆగకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైన వెంటనే స్కానింగ్ పూర్తయ్యేలా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అవసరమైతే మల్టీనేషనల్ కంపెనీలకు టెండర్ ద్వారా స్కానింగ్ బాధ్యతను అప్పగించి ఆ వెంటనే స్కాన్​డ్ కాపీని అందించేలా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. రిజిస్ట్రేషన్ల కోసం డాక్యుమెంట్ రైటర్లపై ఆధారకుండా క్రయవిక్రయదారులు నేరుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకునేలా కూడా అవసరమైన ఏర్పాట్లు చేయనున్నారు. ఇందుకోసం అవసరమైన నమూనా పత్రాలను ప్రభుత్వమే సిద్ధం చేస్తోంది. కేవలం పేర్లు, వివరాలు నమోదు చేసుకోవడం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం డాక్యుమెంట్​ను సిద్ధం చేసుకునేలా నమూనా పత్రాలను సిద్ధం చేస్తున్నారు.

తహసీల్దార్లకు మరోసారి శిక్షణ

తహసీల్దార్లు.. సబ్‌ రిజిస్ట్రార్ల విధులను నిర్వహించాల్సి ఉండడంతో గతంలో ఒకసారి రిజిస్ట్రేషన్ల చట్టంపై శిక్షణ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం... మరొకసారి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. రిజిస్ట్రేషన్‌ చట్టం-1908, స్టాంపుల చట్టం-1899 లపై శిక్షణ ఇవ్వడం ద్వారా... భవిష్యత్తులో తహసీల్దార్లు.. రిజిస్ట్రేషన్లు చేసేందుకు ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఒకట్రెండు రోజులు చట్టాలపై శిక్షణ ఇవ్వాలని యోచిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. అవసరమైతే తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్‌లపై కూడా ఒకట్రెండు రోజులు శిక్షణ ఇస్తారు. అదేవిధంగా సబ్‌ రిజిస్ట్రార్లకు మున్సిపల్‌ చట్టాలపై శిక్షణ ఇచ్చి.. అవగాహన కల్పించడం ద్వారా రిజిస్ట్రేషన్లు పూర్తవగానే.. మ్యుటేషన్లు చేసేందుకు సబ్‌ రిజిస్ట్రార్లకు ఇబ్బందులు తలెత్తవని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే క్యాడ్‌ సాప్ట్‌వేర్‌ను ఉపయోగించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేస్తున్న రిజిస్ట్రేషన్‌ శాఖకు... ధరణి పోర్టల్‌ను కూడా అనుసంధానం చేయనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా.. తహసీల్దార్‌ కార్యాలయాలకు కూడా ఈ రెండు సాఫ్ట్​వేర్లు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. అయితే ధరణి పోర్టల్‌ అనుసంధానంతో.. ఈసీలు ఇవ్వడానికి ఇబ్బందులు ఏర్పడతాయని రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్న తర్వాత... రిజిస్ట్రేషన్లను తిరిగి ప్రారంభించాలని భావిస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చి పెట్టే శాఖల్లో.. రిజిస్ట్రేషన్ల శాఖ ఒకటి. అలాంటి శాఖ విషయంలో.. ఏ మాత్రం అలసత్వం జరగకుండా అవసరమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటోంది. ఈ నెల చివర నాటికి... అన్ని చర్యలు పూర్తి చేసి రెండు శాఖల్లో ఒకేసారి రిజిస్ట్రేషన్లను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది.


ఇవీ చూడండి: కాంగ్రెస్, భాజపాలు తెరాసకు పోటీ కానే కావు: మంత్రి ఎర్రబెల్లి

Last Updated : Sep 22, 2020, 6:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.